Shahid Afridi: “అబద్ధాలు చెప్పినందుకు అవార్డ్”.. షాహిద్ అఫ్రిదికి పాక్ ప్రధాని సత్కారం..
- పాకిస్తాన్ ప్రధానితో షాహిద్ అఫ్రిది సమావేశం..
- అఫ్రిదిని సత్కరించిన పీఎం షహబాజ్ షరీఫ్..
- ఆపరేషన్ సిందూర్పై అఫ్రిది అబద్ధాలు..
- గెలిచామంటూ కరాచీలో విక్టరీ ర్యాలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాకిస్తాన్ తమకు ఏం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలకు హాజరవుతున్నారు. భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. పీఓకే, పాక్ భూభాగాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందిని హతమార్చింది. అయినా కూడా ఏం జరగనట్లు పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేస్తోంది.
Read Also: Hyderabad: హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 53 మంది!
Also Read
ఇదిలా ఉంటే, ఈ గుంపులో ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ కూడా చేశారు. ఇస్లామాబాద్ పాక్ ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో వీరిద్దరు పాక్ ఆర్మీ నిర్వహించినట్లు చెబుతున్న ‘‘ఆపరేషన్ బన్యానమ్ మర్సూస్’’ విజయవంతంపై పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్లను అభినందించారు. షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సైన్యాన్ని కొనియాడారు. ఈ కీలక సమయంలో దేశం మొత్తం ఏకమై శత్రువుకు శక్తివంతమైన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాహిద్ అఫ్రిదికి కృతజ్ఞతలు తెలుపుతూ, పాక్ సైన్యానికి మద్దతుగా నిలిచినందకు, విజయోత్సవ ర్యాలీ తీసినందుకు ప్రశంసించారు.
ఈ సమావేశంలో సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అత్తౌల్లా తరార్ కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఆఫ్రిదిని ప్రశంసిస్తూ అవార్డుతో సన్మానించారు. అఫ్రిదితో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. వీరికి సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్లను, సోషల్ మీడియా అకౌంట్లను భారత్ బ్లాక్ చేసింది. ముఖ్యంగా, షాహిద్ అఫ్రిది భారత్ పై ఉన్న ద్వేషాన్ని ప్రదర్శించారు. కరాచీలో పాక్ సైన్యం భారత్పై విజయం సాధించిందని విక్టరీ ర్యాలీ చేశారు. భారత్ సైన్యం మసీదులు, ప్రజలపై దాడులు చేస్తుందని ఆరోపించారు. విదేశాల్లో సిక్కు కార్యకర్తలపై మోడీ ప్రభుత్వం దాడులు చేస్తుందని అబద్ధాలు చెప్పాడు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!