Ukraine War: “చెర్నోబిల్” వద్ద రేడియేషన్ బారిన పడిన రష్యా సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ 1986లో పేలిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా మారింది.
చెర్నోబిల్ విపత్తు తరువాత, రసాయన నిపుణుల బృందాలు కలుషితమైన మట్టిని త్రవ్వి అక్కడి రెడ్ ఫారెస్ట్లో భూమి క్రింద పాతిపెట్టడానికి పెట్టారు. రెేడియేషన్ అక్కడి పరిసరాల్లోకి వ్యాపించడంతో అటువైపుగా జనాలు వెళ్లకుండా 37 ఏళ్లకుపైగా నిషేధం కొనసాగుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలోకి రష్యా సైన్యం చొచ్చుకు వెల్లింది. దాదాపుగా 5 వారాల పాటు చెర్నోబిల్ ఏరియాలోనే రష్యా సైనికులు ఉన్నారు. దీంతో వారు రేడియేషన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
Read Also: Go First: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
అత్యంత విధ్వంసకమైన అణు ప్రమాదం..
1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత 1.23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పర్యవేక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ పేలుడు సంభవించింది. అణురియాక్టర్ లోని నాలుగో నంబర్ యూనిట్ లో విద్యుత్ సరఫరా ఆపేశారు. ఈ పనిచేయడానికి ముందే రియాక్టర్ సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు గుర్తించలేదు.
కరెంట్ నిలిచిపోవడంతో రియాక్టర్ కు నీటిని సఫ్లై చేసే టర్బైన్స్ ఆగిపోయాయి. ఫలితంగా రియాక్టర్లలో పీడన పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది. అప్పటికే రియాక్టర్ ని నిలిపేద్దాం అనుకున్నప్పటికీ ఆలస్యం జరిగిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా చెర్నోబిల్ ప్రాంతం నుంచి 2.34 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లారు. రేడియేషన్ వల్ల 47 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!