Russia-Ukraine War: అంధకారం దిశగా ఉక్రెయిన్.. విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా రష్యా దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia attacks on Ukraine targeting power system: రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఆ దేశ విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో తీవ్రంగా దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు విద్యుత్ వ్యవస్థలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ నాశనం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. తమ విద్యుత్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన మంగళవారం అన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఉక్రెయిన్ ఖార్కీవ్ ప్రాంతాన్ని రష్యా నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడుల కారణంగా రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్, నీరు అంతరాయానికి, శీతాకాలం పరిస్థితులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో వెల్లడించారు.
Also Read
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
Read Also: Pakistan: భారత్కు ఇచ్చిన ధరకే మాకు ఇస్తే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం
మంగళవారం తెల్లవారుజామున కీవ్, ఖార్కీవ్, డ్నిప్రో, జైటోమిర్ ప్రాంతాలపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంధకారం నెలకొంది. ఆస్పత్రులు జనరేటర్ల సహాయంతో నడుస్తున్నాయి. రష్యా దాడులను తీవ్రవాద దాడులుగా అభివర్ణించారు జెలన్ స్కీ. అక్టోబర్ 10 నుంచి రష్యా దాడుల్లో 30 శాతం పవర్ స్టేషన్లు నాశనం అయ్యాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ అవుట్ ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు స్థానం లేదని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ రెండవ పెద్ద పట్టణం అయిన ఖార్కీవ్ పై రష్యా ఎనిమిది క్షిపణులతో దాడులు చేసింది. కీవ్ నగరంలో మౌళిక సదుపాయాలను నాశనం చేసింది రష్యా. మంగళవారం జరిగిన దాడుల్లో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా, ఉక్రెయిన్ లో విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ హీటింగ్, ఎలక్ట్రిక్ వ్యవస్థను ప్రణాళికలో భాగంగా ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ కు చెందిన షాహెద్-136 డ్రోన్లను 38ని కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
తాజావార్తలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!