Russia-Ukraine War: అంధకారం దిశగా ఉక్రెయిన్.. విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా రష్యా దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia attacks on Ukraine targeting power system: రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఆ దేశ విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో తీవ్రంగా దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు విద్యుత్ వ్యవస్థలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ నాశనం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. తమ విద్యుత్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన మంగళవారం అన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఉక్రెయిన్ ఖార్కీవ్ ప్రాంతాన్ని రష్యా నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడుల కారణంగా రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్, నీరు అంతరాయానికి, శీతాకాలం పరిస్థితులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో వెల్లడించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
Read Also: Pakistan: భారత్కు ఇచ్చిన ధరకే మాకు ఇస్తే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం
మంగళవారం తెల్లవారుజామున కీవ్, ఖార్కీవ్, డ్నిప్రో, జైటోమిర్ ప్రాంతాలపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంధకారం నెలకొంది. ఆస్పత్రులు జనరేటర్ల సహాయంతో నడుస్తున్నాయి. రష్యా దాడులను తీవ్రవాద దాడులుగా అభివర్ణించారు జెలన్ స్కీ. అక్టోబర్ 10 నుంచి రష్యా దాడుల్లో 30 శాతం పవర్ స్టేషన్లు నాశనం అయ్యాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ అవుట్ ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు స్థానం లేదని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ రెండవ పెద్ద పట్టణం అయిన ఖార్కీవ్ పై రష్యా ఎనిమిది క్షిపణులతో దాడులు చేసింది. కీవ్ నగరంలో మౌళిక సదుపాయాలను నాశనం చేసింది రష్యా. మంగళవారం జరిగిన దాడుల్లో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా, ఉక్రెయిన్ లో విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ హీటింగ్, ఎలక్ట్రిక్ వ్యవస్థను ప్రణాళికలో భాగంగా ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ కు చెందిన షాహెద్-136 డ్రోన్లను 38ని కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!