Parle-G Biscuits: రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
- గాజాలో తీవ్రస్థాయిలో కరవు
- రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో రూ.2,400 అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది చనిపోగా.. ఇంకొందరు తిండి లేక ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో నిత్యావసర వస్తువులు లోపలికి వెళ్లడం లేదు. దీంతో కరవు తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఎక్కడైనా కిరాణా సామాగ్రి దొరికితే ధరలు ఆకాశాన్నంటాయి. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పార్లే-జీ బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయి.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీ సర్కార్ కసరత్తు.. ఇక, రేషన్ బదులు నగదు..!
Also Read
గాజాలో ప్రస్తుతం రూ.5 ఇండియన్ బిస్కెట్ రూ.2,400కి అమ్ముడవుతోంది. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ బిస్కెట్లు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుంచి ఎగుమతి అవుతుంది. భారతీయ గృహాల్లో ప్రధానంగా పిల్లలు టీ బ్రేకుల సమయంలో ఉపయోగిస్తుంటారు. పోషకాహారం ముడిపడి ఉండడంతో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ధర తక్కువే కానీ.. గాజాలో కరవు కారణంగా 500 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతుంది.
ఇది కూడా చదవండి: PM Modi: చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం
ఇటీవల గాజా నుంచి ఒక పోస్ట్ వైరల్ అయింది. పార్లే జీ బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడుపోతున్నాయని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘చాలాసేపు వేచి ఉన్న తర్వాత నేను చివరకు ఈరోజు రవీఫ్కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నాను. ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగినప్పటికీ.. రఫీఫ్కు ఇష్టమైన ట్రీట్ను నేను కాదనలేకపోయాను.’’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన భారతీయులు.. ఇండియాలో ఇంత చౌకైన బిస్కెట్లు.. గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పార్లే జీ బిస్కెట్ ఒక్కటే కాదు. అన్ని నిత్యావసర ధరలన్నీ ఇదే మాదిరిగా ఉన్నాయి. జూన్ 6, 2025 నాటికి ఉత్తర గాజా నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన ధరలు ఇలా ఉన్నాయి.
కిలో చక్కెర: రూ. 4,914
లీటరు వంట నూనె: రూ. 4,177
కిలో బంగాళాదుంపలు: రూ. 1,965
కిలో ఉల్లిపాయలు: రూ. 4,423
కాఫీ కప్పు: రూ. 1,800
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
తాజావార్తలు
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!