Parle-G Biscuits: రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
- గాజాలో తీవ్రస్థాయిలో కరవు
- రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో రూ.2,400 అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది చనిపోగా.. ఇంకొందరు తిండి లేక ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో నిత్యావసర వస్తువులు లోపలికి వెళ్లడం లేదు. దీంతో కరవు తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఎక్కడైనా కిరాణా సామాగ్రి దొరికితే ధరలు ఆకాశాన్నంటాయి. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పార్లే-జీ బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయి.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీ సర్కార్ కసరత్తు.. ఇక, రేషన్ బదులు నగదు..!
Also Read
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
గాజాలో ప్రస్తుతం రూ.5 ఇండియన్ బిస్కెట్ రూ.2,400కి అమ్ముడవుతోంది. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ బిస్కెట్లు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుంచి ఎగుమతి అవుతుంది. భారతీయ గృహాల్లో ప్రధానంగా పిల్లలు టీ బ్రేకుల సమయంలో ఉపయోగిస్తుంటారు. పోషకాహారం ముడిపడి ఉండడంతో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ధర తక్కువే కానీ.. గాజాలో కరవు కారణంగా 500 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతుంది.
ఇది కూడా చదవండి: PM Modi: చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం
ఇటీవల గాజా నుంచి ఒక పోస్ట్ వైరల్ అయింది. పార్లే జీ బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడుపోతున్నాయని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘చాలాసేపు వేచి ఉన్న తర్వాత నేను చివరకు ఈరోజు రవీఫ్కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నాను. ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగినప్పటికీ.. రఫీఫ్కు ఇష్టమైన ట్రీట్ను నేను కాదనలేకపోయాను.’’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన భారతీయులు.. ఇండియాలో ఇంత చౌకైన బిస్కెట్లు.. గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పార్లే జీ బిస్కెట్ ఒక్కటే కాదు. అన్ని నిత్యావసర ధరలన్నీ ఇదే మాదిరిగా ఉన్నాయి. జూన్ 6, 2025 నాటికి ఉత్తర గాజా నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన ధరలు ఇలా ఉన్నాయి.
కిలో చక్కెర: రూ. 4,914
లీటరు వంట నూనె: రూ. 4,177
కిలో బంగాళాదుంపలు: రూ. 1,965
కిలో ఉల్లిపాయలు: రూ. 4,423
కాఫీ కప్పు: రూ. 1,800
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!