Xi Jinping: చైనా ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది.. ఎట్టకేలకు ఒప్పుకున్న షి జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు. ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాడరు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి’ అనే అంశంపై చైనా అధికారిక మీడియాలో అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మరిన్ని ప్రయత్నాలు చేయాలని జిన్ పింగ్ తెలిపారు.
50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చైనాలో అత్యల్ప వృద్ధి రేటు నమోదు అయింది. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా మూడు శాతం వృద్ధిరేటుకు మాత్రమే పరిమితం అయింది. 2023లో ఆర్థిక పరిస్థితి సంక్షిష్టంగా ఉందని.. దానిని పునరుద్దరించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని జిన్ పింగ్ పేర్కొన్నాడు. ప్రధాన సమస్యలు, ప్రజల అంచనాలను మెరుగుపరచడం, అభివృద్ధిపై విశ్వాసం పెంచడం ప్రారంభించాలని సూచించాడు.
Also Read
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
Read Also: Lord Hanuman on Aircraft: విమానంపై మళ్లీ ప్రత్యక్షం అయిన హనుమాన్ చిత్రం..
తయారీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా చైనా ఉంది. అయితే కోవిడ్ సంక్షోభం, జీరో కోవిడ్ విధానం, బలవంతపు లాక్ డౌన్లు, టెక్ పరిశ్రమలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అణిచివేత కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం దెబ్బతింది. చాలా వరకు పెట్టుబడులు ఇండియా, ఇతర దేశాలకు తరలివెళ్లాయి. ప్రస్తుతం చైనా జీడీపీ 17.94 ట్రిలియన్లకు చేరుకుంది. 1974లో చివరి సారిగా చైనా జీడీపీ 2.3 శాతానికి పరిపోయిండి, ఇదే అతితక్కువ వృద్ధిరేటు. ఇక ఆర్థిక మందగమనం కారణంగా ఆ దేశంలో నిరసనలు పెరిగాయి.
దీనికి తోడు చైనాలో వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు జనాభా రేటు క్షీణిస్తోంది. గతేడాది చివరి నాటికి 60 ఏళ్లు నిండిన వృద్ధుల సంఖ్య 26.7 కోట్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో 18.9 శాతం. 2025 నాటికి 30 కోట్లకు , 2035 నాటికి అక్కడ వృద్ధుల జనాబా 40 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!