Xi Jinping: చైనా ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది.. ఎట్టకేలకు ఒప్పుకున్న షి జిన్పింగ్
Xi Jinping: ఎట్టకేలకు చైనా ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఒప్పుకున్నాడు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయని.. ఇలాంటి సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని జిన్ పింగ్ అన్నారు. ఆర్థిక నష్టాలను అరికట్టేందుకు, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాడరు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి’ అనే అంశంపై చైనా అధికారిక మీడియాలో అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, మరిన్ని ప్రయత్నాలు చేయాలని జిన్ పింగ్ తెలిపారు.
50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చైనాలో అత్యల్ప వృద్ధి రేటు నమోదు అయింది. ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఉన్న చైనా మూడు శాతం వృద్ధిరేటుకు మాత్రమే పరిమితం అయింది. 2023లో ఆర్థిక పరిస్థితి సంక్షిష్టంగా ఉందని.. దానిని పునరుద్దరించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని జిన్ పింగ్ పేర్కొన్నాడు. ప్రధాన సమస్యలు, ప్రజల అంచనాలను మెరుగుపరచడం, అభివృద్ధిపై విశ్వాసం పెంచడం ప్రారంభించాలని సూచించాడు.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
Read Also: Lord Hanuman on Aircraft: విమానంపై మళ్లీ ప్రత్యక్షం అయిన హనుమాన్ చిత్రం..
తయారీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా చైనా ఉంది. అయితే కోవిడ్ సంక్షోభం, జీరో కోవిడ్ విధానం, బలవంతపు లాక్ డౌన్లు, టెక్ పరిశ్రమలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అణిచివేత కారణంగా అక్కడ పారిశ్రామిక రంగం దెబ్బతింది. చాలా వరకు పెట్టుబడులు ఇండియా, ఇతర దేశాలకు తరలివెళ్లాయి. ప్రస్తుతం చైనా జీడీపీ 17.94 ట్రిలియన్లకు చేరుకుంది. 1974లో చివరి సారిగా చైనా జీడీపీ 2.3 శాతానికి పరిపోయిండి, ఇదే అతితక్కువ వృద్ధిరేటు. ఇక ఆర్థిక మందగమనం కారణంగా ఆ దేశంలో నిరసనలు పెరిగాయి.
దీనికి తోడు చైనాలో వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు జనాభా రేటు క్షీణిస్తోంది. గతేడాది చివరి నాటికి 60 ఏళ్లు నిండిన వృద్ధుల సంఖ్య 26.7 కోట్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో 18.9 శాతం. 2025 నాటికి 30 కోట్లకు , 2035 నాటికి అక్కడ వృద్ధుల జనాబా 40 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!