Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
- జర్మన్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పర్యటన
- భారతీయ సమాజంతో సమావేశం
- ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి
- పశ్చిమాసియా శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశానికి కూడా ఒక సమయం వస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ప్రస్తుతం రాజ్నాథ్సింగ్ జర్మనీలో పర్యటిస్తున్నారు. బెర్లిన్లో భారతీయ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశ పాత్ర ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ… ‘‘భారతదేశం ప్రయత్నించిందని.. అయినా ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. రేపన్న రోజున భారతదేశం ఆ పాత్రను పోషించి విజయం సాధించే సమయం రావొచ్చు. ఆ అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం. యుద్ధాన్ని ముగించాలని ఇరుపక్షాలకు ప్రధాని మోడీ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మోడీకి చాలా సమతుల్య వైఖరి ఉంది.’’ అని పేర్కొన్నారు.
‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిసినప్పుడు కూడా యుద్ధం గురించి మోడీ చర్చించారు. యుద్ధం ముగించాలని కోరారు. రేపు ట్రంప్ను కలిసినప్పుడు కూడా చర్చించి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పారు. భారతదేశం వ్యవహరిస్తున్న తీరును మీరు చూసే ఉంటారు. హార్ముజ్ జలసంధి నుంచి ఏ దేశానికి చెందిన నౌక వెళ్లలేకపోయింది. కానీ భారతదేశానికి చెందిన 7-8 నౌకలు వెళ్లగలిగాయి. దీనికి కారణం భారతదేశ వ్యవహరిస్తున్న సమతుల్య వైఖరే కారణం.’’ అని రాజ్నాథ్సింగ్ వివరించారు.
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
‘‘ఇక పశ్చిమాసియా పరిస్థితి విషయానికి వస్తే.. మన దేశం అతి తక్కువగా ప్రభావితమైన దేశం. ముడి చమురు, ఇంధనం, ఎల్పీజీ, ఇతర వస్తువులు ఏవైనా సరే. ఈ రోజు కూడా మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయి. నా అధ్యక్షతన కొందరు సీనియర్ మంత్రులతో మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ప్రతి వారం దానికి హాజరవుతున్నాను. క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నాను. ప్రత్యేకంగా ఎలాంటి సమస్య లేదు. సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రయత్నించిన కొన్ని శక్తులు ఉన్నాయి. వాటికి కూడా గుణపాఠం చెప్పాం.’’ అని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి రప్పించడం గురించి ప్రశ్నించినప్పుడు… ‘‘ఇతర దేశాల నుంచి రావాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రజలను తీసుకురావడానికి విమానాలను కూడా పంపింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సంక్షోభం తలెత్తినప్పుడు.. మా ప్రభుత్వం బయటి నుంచి ప్రజలను తీసుకువచ్చింది. జీవితంలో ఏదైనా సమస్య ఉంటే.. వారు భారతదేశానికి రావచ్చు. దాని కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.’’ అని బదులిచ్చారు.
‘‘నేడు ప్రపంచ వేదికపై అగ్రరాజ్యంగా అవతరించడానికి ఒక పోటీ జరుగుతోంది. ఈ పోటీలో భాగం కావడం కంటే.. యావత్ ప్రపంచాన్నే ఒక కుటుంబంగా భావించే మార్గంలో భారతదేశం పయనిస్తోంది. ప్రపంచంలోనే సాధువులు, రుషులు ‘ప్రపంచమంతా ఒక కుటుంబం’ అని చాటిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ‘వసుదైక కుటుంబం’ అనే సందేశం ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయితే యావత్ ప్రపంచానికి చేరిందో.. ఆ దేశం మన భారతదేశమే.’’ అని అన్నారు.
‘‘రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీలకు భారతదేశం ప్రపంచ కేంద్రంగా అవతరించిందని తెలుసుకోవడం ఆశ్చర్యం. సంతోషం కలిగిస్తుంది. భారతదేశం కాగితం, నగదు రహితం. నిరాటంకమైన ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా పయనిస్తోంది. కేవలం మార్చి నెలలోనే 22.64 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇది ఒక కొత్త రికార్డు. వాటి విలువ సుమారు రూ. 29.53 లక్షల కోట్లు. ఈ రోజు మనం ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ యూపీఐ సౌకర్యాన్ని అందించాం.’’ అని రాజ్నాథ్సింగ్ గుర్తుచేశారు.
#WATCH | Berlin, Germany: When asked if India has any role to play in initiating peace amid the West Asia crisis, Defence Minister Rajnath Singh says, "India has tried… But everything has its time. It is possible that tomorrow, the time may come when India plays its role in… pic.twitter.com/qAVdC5lXFC
— ANI (@ANI) April 22, 2026
#WATCH | Berlin, Germany: When asked about the evacuation of Indian nationals stranded in foreign countries during the West Asia crisis, Defence Minister Rajnath Singh says, "…the government has made arrangements for those who want to come from other countries… Planes have… pic.twitter.com/QBYNvyR4dF
— ANI (@ANI) April 22, 2026
#WATCH | Berlin, Germany: Speaking at the Indian community event, Defence Minister Rajnath Singh says, "Today, on the global stage, a race is going on to become a superpower. Instead of becoming a part of this race, India is walking on a path where the whole world feels like a… pic.twitter.com/Rap38Ky9ov
— ANI (@ANI) April 22, 2026
#WATCH | Berlin, Germany: Speaking at the Indian community event, Defence Minister Rajnath Singh says, "It will be a surprise and happiness to know that India has become a global hub of real-time digital transactions… India is moving fast towards a less paper, less cash, but… pic.twitter.com/rFuZtyr9LG
— ANI (@ANI) April 22, 2026
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!