Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rajnath Singh India Role West Asia Peace Talks Modi Diplomacy

Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

Published Date :April 22, 2026 , 12:14 pm
By Suresh Maddala
  • జర్మన్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన
  • భారతీయ సమాజంతో సమావేశం
  • ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి
  • పశ్చిమాసియా శాంతి చర్చలపై కీలక వ్యాఖ్యలు
Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశానికి కూడా ఒక సమయం వస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ప్రస్తుతం రాజ్‌నాథ్‌సింగ్ జర్మనీలో పర్యటిస్తున్నారు. బెర్లిన్‌లో భారతీయ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశ పాత్ర ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ… ‘‘భారతదేశం ప్రయత్నించిందని.. అయినా ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. రేపన్న రోజున భారతదేశం ఆ పాత్రను పోషించి విజయం సాధించే సమయం రావొచ్చు. ఆ అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం. యుద్ధాన్ని ముగించాలని ఇరుపక్షాలకు ప్రధాని మోడీ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మోడీకి చాలా సమతుల్య వైఖరి ఉంది.’’ అని పేర్కొన్నారు.

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిసినప్పుడు కూడా యుద్ధం గురించి మోడీ చర్చించారు. యుద్ధం ముగించాలని కోరారు. రేపు ట్రంప్‌ను కలిసినప్పుడు కూడా చర్చించి ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పారు. భారతదేశం వ్యవహరిస్తున్న తీరును మీరు చూసే ఉంటారు. హార్ముజ్ జలసంధి నుంచి ఏ దేశానికి చెందిన నౌక వెళ్లలేకపోయింది. కానీ భారతదేశానికి చెందిన 7-8 నౌకలు వెళ్లగలిగాయి. దీనికి కారణం భారతదేశ వ్యవహరిస్తున్న సమతుల్య వైఖరే కారణం.’’ అని రాజ్‌‌నాథ్‌సింగ్ వివరించారు.

‘‘ఇక పశ్చిమాసియా పరిస్థితి విషయానికి వస్తే.. మన దేశం అతి తక్కువగా ప్రభావితమైన దేశం. ముడి చమురు, ఇంధనం, ఎల్‌పీజీ, ఇతర వస్తువులు ఏవైనా సరే. ఈ రోజు కూడా మన దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయి. నా అధ్యక్షతన కొందరు సీనియర్ మంత్రులతో మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ప్రతి వారం దానికి హాజరవుతున్నాను. క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నాను. ప్రత్యేకంగా ఎలాంటి సమస్య లేదు. సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రయత్నించిన కొన్ని శక్తులు ఉన్నాయి. వాటికి కూడా గుణపాఠం చెప్పాం.’’ అని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.

మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి రప్పించడం గురించి ప్రశ్నించినప్పుడు… ‘‘ఇతర దేశాల నుంచి రావాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రజలను తీసుకురావడానికి విమానాలను కూడా పంపింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సంక్షోభం తలెత్తినప్పుడు.. మా ప్రభుత్వం బయటి నుంచి ప్రజలను తీసుకువచ్చింది. జీవితంలో ఏదైనా సమస్య ఉంటే.. వారు భారతదేశానికి రావచ్చు. దాని కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.’’ అని బదులిచ్చారు.

‘‘నేడు ప్రపంచ వేదికపై అగ్రరాజ్యంగా అవతరించడానికి ఒక పోటీ జరుగుతోంది. ఈ పోటీలో భాగం కావడం కంటే.. యావత్ ప్రపంచాన్నే ఒక కుటుంబంగా భావించే మార్గంలో భారతదేశం పయనిస్తోంది. ప్రపంచంలోనే సాధువులు, రుషులు ‘ప్రపంచమంతా ఒక కుటుంబం’ అని చాటిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ‘వసుదైక కుటుంబం’ అనే సందేశం ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయితే యావత్ ప్రపంచానికి చేరిందో.. ఆ దేశం మన భారతదేశమే.’’ అని అన్నారు.

‘‘రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీలకు భారతదేశం ప్రపంచ కేంద్రంగా అవతరించిందని తెలుసుకోవడం ఆశ్చర్యం. సంతోషం కలిగిస్తుంది. భారతదేశం కాగితం, నగదు రహితం. నిరాటంకమైన ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా పయనిస్తోంది. కేవలం మార్చి నెలలోనే 22.64 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇది ఒక కొత్త రికార్డు. వాటి విలువ సుమారు రూ. 29.53 లక్షల కోట్లు. ఈ రోజు మనం ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ యూపీఐ సౌకర్యాన్ని అందించాం.’’ అని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేశారు.

#WATCH | Berlin, Germany: When asked if India has any role to play in initiating peace amid the West Asia crisis, Defence Minister Rajnath Singh says, "India has tried… But everything has its time. It is possible that tomorrow, the time may come when India plays its role in… pic.twitter.com/qAVdC5lXFC

— ANI (@ANI) April 22, 2026

#WATCH | Berlin, Germany: When asked about the evacuation of Indian nationals stranded in foreign countries during the West Asia crisis, Defence Minister Rajnath Singh says, "…the government has made arrangements for those who want to come from other countries… Planes have… pic.twitter.com/QBYNvyR4dF

— ANI (@ANI) April 22, 2026

#WATCH | Berlin, Germany: Speaking at the Indian community event, Defence Minister Rajnath Singh says, "Today, on the global stage, a race is going on to become a superpower. Instead of becoming a part of this race, India is walking on a path where the whole world feels like a… pic.twitter.com/Rap38Ky9ov

— ANI (@ANI) April 22, 2026

#WATCH | Berlin, Germany: Speaking at the Indian community event, Defence Minister Rajnath Singh says, "It will be a surprise and happiness to know that India has become a global hub of real-time digital transactions… India is moving fast towards a less paper, less cash, but… pic.twitter.com/rFuZtyr9LG

— ANI (@ANI) April 22, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India digital economy news
  • India foreign policy news
  • India global influence
  • India peace talks Middle East
  • Modi diplomacy global

తాజావార్తలు

  • Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

  • Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

  • High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..

  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!

  • Venugopal Rao: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచేసింది వాళ్లే.. డైరెక్టర్ వేణుగోపాల్ రావు కుండబద్దలు!

ట్రెండింగ్‌

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions