POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ స్థాయిలో నిరసనలు.
- ఆందోళనలను అణచివేసేందుకు పాక్ ఆర్మీ కాల్పులు
- . ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి, 200 మందికి పైగా గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(POK) అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేతకు నిరసనగా పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ హక్కుల కోసం నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్ నుంచి విముక్తి కావడానికి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ స్వాతంత్య్రం కోసం ఆందోళనబాట పట్టారు. అయితే, ఈ ఆందోళనల్ని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణిచివేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి రిజర్వేషన్ వివాదం కారణమైంది.
పాకిస్తాన్ ఆర్మీ అందోళనల్ని అణిచివేయడానికి కాల్పులు జరిపింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. శాంతిభద్రతలు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ అధికారులు శుక్రవారం నాడు జేఏఏసీని నిషేధించింది. శుక్రవారం రాత్రి భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారి మరణించడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంతో ఘర్షణలు చెలరేగాయి.
Also Read
పోలీస్ కాల్పుల్లో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం నాడు ఆస్పత్రి మార్చురీకి తరలించగా జేఏఏసీ నిరసనకారులు అక్కడ గుమిగూడారు. అయితే, నిరసనకారులు తమపై ఆటోమెటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని పోలీసులు ఆరోపించారు. జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గానూ శరణార్థులకు 12 స్థానాలు కేటాయించడంపై ప్రజలు నిరసనలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?