PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- కొనసాగుతున్న మోడీ ఐదు దేశాల పర్యటన
- నార్వేలో సంయుక్త మీడియా సమావేశం
- రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-నార్వే దేశాలు ప్రపంచంలోని శాంతిని ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ నార్వేలో పర్యటిస్తున్నారు. నార్డిక్ దేశాల నాయకులతో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో మోడీ మాట్లాడారు.

Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
భారత్-నార్వే సంబంధాలు అవకాశాలతో నిండి ఉన్నాయని… ప్రపంచంలో శాంతిని ఆకాంక్షిస్తున్నామని.. భారతదేశంతో సంబంధాలు, వాణిజ్యం, ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో తాను రాజీపడబోనని మోడీ పేర్కొన్నారు.
‘‘ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపాక్షికవాదం పట్ల మన పరస్పర నిబద్ధత మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తుంది. అదే సమయంలో సాంకేతికత, సుస్థిరత రంగాల్లో మన ఉమ్మడి ప్రాధాన్యతలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నార్డిక్ దేశాలతో మన సంబంధాలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను రూపొందించాం’’ అని అన్నారు.
‘‘గత కొన్నేళ్లుగా మన సంబంధాల్లో గణనీయమైన పురోగతి సాధించాం. పదేళ్లలో మన ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. భారతదేశ వేగవంతమైన వృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడి నిధులు కూడా ముఖ్యమైన భాగస్వాములుగా మారుతున్నాయి. గత దశాబ్దంలో భారతదేశంలోకి నార్డిక్ దేశాల పెట్టుబడులు దాదాపు 200 శాతం పెరిగాయి.’’ అని తెలిపారు.
‘‘నార్వే, ఐస్లాండ్, ఇతర ఈఎఫ్టీఏ దేశాలతో కలిసి అక్టోబర్ 2025 నుంచి వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేశాం. అంతేకాక కొన్ని నెలల క్రితమే భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. ఇందులో డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాలతో, భారత్-నార్డిక్ దేశాల మధ్య సంబంధాలలో ఒక కొత్త స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతున్నాం.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ప్రపంచ ఉద్రిక్తతలు, సంఘర్షణలు నెలకొన్న ఈ యుగంలో భారతదేశం-నార్డిక్ దేశాలు నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయడం కొనసాగిస్తాయి. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా.. సంఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలికి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు మేము మద్దతు ఇవ్వడం కొనసాగిస్తాం. బహుళపక్ష సంస్థల సంస్కరణలు అవసరమని, అత్యవసరమని మేము అంగీకరిస్తున్నాము. ఉగ్రవాదం విషయంలో కూడా మాకు స్పష్టమైన, స్థిరమైన వైఖరి ఉంది. రాజీ లేదు. ద్వంద్వ ప్రమాణాలు లేవు. ఈ రోజు నేను ‘సంబంధ్’ అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించాను. అనేక నార్డిక్ భాషలలో ‘సంబంధ్’ అనే పదానికి అనుబంధం, సంబంధం, బంధం అని అర్థం. హిందీలో కూడా ‘సంబంధ్’కు అదే అర్థం ఉంది. ఇది కేవలం పదాల సారూప్యత మాత్రమే కాదు. ఇది మన ఆలోచనల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
In this era of global tension and conflict, India and the Nordic countries remain committed to advocating for a rules-based international order. Whether in Ukraine, West Asia, or elsewhere, we continue to support efforts aimed at achieving an early cessation of hostilities and… pic.twitter.com/q3n3ohwWca
— BJP (@BJP4India) May 19, 2026
తాజావార్తలు
-
Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ డైరెక్టర్తో విశ్వక్ మూవీ!
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!