PM Modi: నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోడీ.. కీలక అంశాలపై చర్చ
- మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోడీ..
- ప్రధాన మంత్రి మోడీకి ఘన స్వాగతం పలికిన నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు..
- నవంబర్ 18-19లో బ్రెజిల్ లో జరగనున్న జీ-20 సమ్మిట్ లో పాల్గొననున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలుత నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. నైజీరియాలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారత ప్రధాని వారికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
Read Also: Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
Also Read
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
అలాగే, ఈ నెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న భారత్- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధానికి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.
Read Also: Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం
ఇక, నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా కొనసాగుతున్నాయి. గతేడాది భారత్లో జీ-20 సదస్సు జరిగ్గా.. ఇప్పుడు బ్రెజిల్లో జరగబోతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి శిఖరాగ్ర సమావేశం కానుంది.
తాజావార్తలు
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!