Nepal Plane Crash: 18 మంది చనిపోయినా, పైలెట్ మాత్రం అద్భుతంగా బయటపడ్డాడు.. ఎలా సాధ్యమైంది..
- నేపాల్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన పైలెట్..
- 18 మందిని బలితీసుకున్న.. మృత్యుంజయుడిగా నిలిచిన శక్యా..
- ఎలా సాధ్యమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Flight crash: నేపాల్లో నిన్న జరిగిన భయంకర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఒక్క పైలెట్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కెప్టెన్ మనీష్ రాజ్ షాక్యా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలాడు. అంతటి ఘోర విమాన ప్రమాదంలో పైలెట్ ప్రాణాలతో ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Also: Tata Curvv EV: అదిరిపోయిన టాటా కర్వ్ EV ఇంటీరియర్, ఫీచర్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
- Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
సౌర్య ఎయిర్లైన్స్కి చెందిన బోంబార్డియన్ CRJ-200 విమానం, 19 మంది సిబ్బందితో సహా, ఇద్దరు సిబ్బంది, ఎయిర్లైన్లోని సాంకేతిక సిబ్బందితో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. మృతుల్లో 15 మంది అక్కడిక్కడే మరణించగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ ఉన్న కాక్పిట్ భాగం ఓ కంటైనర్ని ఢీ కొట్టింది. కాక్ పిట్ కంటైన్లో చిక్కుకుని, మిగతా విమానభాగాలు వేరై నేలపై పడి మంటలు అంటుకున్నాయి. 37 ఏళ్ల షాక్యాని కంటైనర్ లోపల గుర్తించారు. ఇదే అతడి ప్రాణాలను కాపాడింది.
ప్రస్తుతం షాక్యా ఖాట్మాండు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. అతడి మెదడులో గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. వెన్నుముక రెండు ప్రాంతాల్లో విరిగినట్లు వైద్యులు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి బుధవారంతో పోలిస్తే గురువారం మెరుగైనట్లు వెల్లడించారు. షాక్యా మంటల్లో కాలిపోనప్పటికీ, పలు ప్రాంతాల్లో ఎముకలు విరిగినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి అతను పూర్తిగా బయటపడ్డాడని, మాట్లాడగలడని, ద్రవాహారాన్ని తసుకోవచ్చని వైద్యులు చెప్పారు.
#nepalcrash kills 18; captain survives
A small passenger plane of Nepal's @SauryaAirlines crashed and caught fire while taking off from #Kathmandu, killing 18 people on board and leaving one survivor, the captain.@Reuters
@x/JacdecNew@skynews @TOIIndiaNews @indianexpress pic.twitter.com/6tuGcO6Hki— Slayer of Cheats (@vi_shukla) July 24, 2024
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..