Pakistan: పాక్ సైన్యానికి రెండు పూటల ముద్ద కరువు.. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan unable to feed soldiers: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పెరిగిన ధరలు, ఆహారం కొరత పాక్ ప్రజలను వేధిస్తున్నాయి. చికెన్, వంటనూనె, పప్పులు, గోధుము ఇలా అన్ని నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి. ఇదిలా ఉంటే పాక్ ప్రభుత్వం అక్కడి సైన్యానికి కనీసం రెండు పూటల తిండి పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆర్మీ మెస్ లలో ఆహార కొరత ఏర్పడింది. ఈ విషయమై ఫీల్డ్ కమాండర్లు క్వార్టర్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి లేఖలు రాశారు. అన్ని ఆర్మీ మెస్సుల్లో సైనికులకు ఆహార సరఫరాలో కోత విధించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
సైనిక అధికారులు ఆహార సరఫరా, లాజిస్టిక్స్ సమస్యలపై చీఫ్ ఆఫ్ లాజిస్టిక్ స్టాఫ్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ తో చర్చించారు. ఈ విషయమై ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వద్ద తమ సమస్యలను వెళ్లగక్కుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రత్యేక నిధులలో కోత మధ్య సైన్యం సైనికులకు రెండుసార్లు సరిగ్గా ఆహారం ఇవ్వలేకపోతున్నారు. దేశ సరిహద్దుల్లో తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లను ఎదుర్కొనే సైనికులు మరింతగా ఆహార కోతలను భరించే స్థితిలో లేదని సైన్యం తెలిపింది.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్ పొదుపు చర్యలను చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించడంతో పాటు రాయబార సిబ్బందిని తగ్గించడం చేసింది. ఐఎస్ఐ, ఐబీకి ఇచ్చే నిధుల్లో కోత పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రెండు రోజలు క్రితం అన్ని జీతాలు, బిల్లలను ఆపేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుని విపరీతంగా పన్నులను పెంచుతోంది. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు వేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..