Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- 15 మంది సైనికుల ఊచకోత..
- ఎవరీ 'ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ittehad-ul-Mujahideen: పాకిస్థాన్లో ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబన్ (TTP), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సంస్థలు రక్తపాతం సృష్టిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ అనే ఉగ్రవాద సంస్థ దేశాన్ని వణికిస్తోంది. ఆదివారం బన్నూ ప్రాంతంలో పాక్ సైన్యంపై ఈ ముఠా జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆర్మీ తన ఆధీనంలో ఉందని చెప్పుకునే ప్రాంతంలోనే ఈ స్థాయి దాడి జరగడం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఏడాది క్రితమే పుట్టుక.. లక్ష్యం ఒక్కటే
ఈ ఉగ్రవాద సంస్థ సరిగ్గా ఏడాది క్రితం, ఏప్రిల్ 11, 2025న స్థాపించబడింది. తెహ్రీక్-ఎ-తాలిబన్ తరహాలోనే పాకిస్థాన్లో కఠినమైన ఇస్లామిక్ పాలనను తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్థలోని ఉగ్రవాదులందరూ ఎక్కువగా అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్నారు. బిబిసి మానిటరింగ్ నివేదిక ప్రకారం.. 2025లో ఖైబర్ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మూడు వేర్వేరు ఉగ్రవాద బృందాల కలయికతో ఈ కొత్త సంస్థ ఏర్పడింది. ఇస్లామిక్ క్రాంతి, లష్కరే-ఇ-ఇస్లాం, హాఫిజ్ గుల్ బహదూర్ గ్రూప్ (ఒకప్పుడు పాక్ ప్రభుత్వం దీనిని ‘గుడ్ తాలిబన్’ అని పిలిచేది).
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
నాయకుడు లేడు.. కానీ వ్యూహం పక్కా
పాక్ సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ సంస్థ ఒక వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనికి అధికారికంగా ఎలాంటి ‘సర్కార్’ లేదా ‘నాయకుడు’ లేడు. దీనివల్ల సైన్యం ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతోంది. టెలిగ్రామ్ వేదికగా ఈ సంస్థ పష్టో, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో తన ప్రచారాన్ని సాగిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మహ్మూదుల్ హసన్ అనే వ్యక్తి ఈ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
బన్నూ దాడి తర్వాత పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఉగ్రవాద సంస్థ వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందని, అఫ్గాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్తో జరిగిన ఒప్పందాల వల్ల TTP దాడులు కొంత తగ్గాయి. ఇదే సమయంలో BLA కూడా బలహీనపడటంతో, ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంతర్జాతీయ భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతానికి బన్నూ దాడి ఈ ఏడాది పాక్ ఎదుర్కొన్న అతిపెద్ద ఉగ్రవాద దాడి కావడంతో, ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..