Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Terror Attack Bannu Ittehad Ul Mujahideen 15 Soldiers Killed

Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!

Published Date :May 11, 2026 , 7:31 pm
By Shiva Ganesh
  • 15 మంది సైనికుల ఊచకోత..
  • ఎవరీ 'ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్'
Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ittehad-ul-Mujahideen: పాకిస్థాన్‌లో ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబన్ (TTP), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సంస్థలు రక్తపాతం సృష్టిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ అనే ఉగ్రవాద సంస్థ దేశాన్ని వణికిస్తోంది. ఆదివారం బన్నూ ప్రాంతంలో పాక్ సైన్యంపై ఈ ముఠా జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆర్మీ తన ఆధీనంలో ఉందని చెప్పుకునే ప్రాంతంలోనే ఈ స్థాయి దాడి జరగడం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఏడాది క్రితమే పుట్టుక.. లక్ష్యం ఒక్కటే
ఈ ఉగ్రవాద సంస్థ సరిగ్గా ఏడాది క్రితం, ఏప్రిల్ 11, 2025న స్థాపించబడింది. తెహ్రీక్-ఎ-తాలిబన్ తరహాలోనే పాకిస్థాన్‌లో కఠినమైన ఇస్లామిక్ పాలనను తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్థలోని ఉగ్రవాదులందరూ ఎక్కువగా అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్నారు. బిబిసి మానిటరింగ్ నివేదిక ప్రకారం.. 2025లో ఖైబర్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న మూడు వేర్వేరు ఉగ్రవాద బృందాల కలయికతో ఈ కొత్త సంస్థ ఏర్పడింది. ఇస్లామిక్ క్రాంతి, లష్కరే-ఇ-ఇస్లాం, హాఫిజ్ గుల్ బహదూర్ గ్రూప్ (ఒకప్పుడు పాక్ ప్రభుత్వం దీనిని ‘గుడ్ తాలిబన్’ అని పిలిచేది).

Also Read

  • Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
  • Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
Add as a preferred
source on google

నాయకుడు లేడు.. కానీ వ్యూహం పక్కా
పాక్ సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ సంస్థ ఒక వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనికి అధికారికంగా ఎలాంటి ‘సర్కార్’ లేదా ‘నాయకుడు’ లేడు. దీనివల్ల సైన్యం ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతోంది. టెలిగ్రామ్ వేదికగా ఈ సంస్థ పష్టో, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో తన ప్రచారాన్ని సాగిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మహ్మూదుల్ హసన్ అనే వ్యక్తి ఈ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

బన్నూ దాడి తర్వాత పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఉగ్రవాద సంస్థ వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందని, అఫ్గాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఒప్పందాల వల్ల TTP దాడులు కొంత తగ్గాయి. ఇదే సమయంలో BLA కూడా బలహీనపడటంతో, ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంతర్జాతీయ భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతానికి బన్నూ దాడి ఈ ఏడాది పాక్ ఎదుర్కొన్న అతిపెద్ద ఉగ్రవాద దాడి కావడంతో, ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan Pakistan Border News
  • Bannu Suicide Blast
  • Hafiz Gul Bahadur Group
  • Islamic Kranti Terror Group
  • Ittehad-ul-Mujahideen

తాజావార్తలు

  • Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions