Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Prices: ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడిచమురు మార్కెట్పై పడుతున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆ దేశ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను రూ.6.80 మేర తగ్గించింది. అయితే, పాక్లో ధరలు తగ్గుతుంటే.. భారత్లో మాత్రం ఇంధన ధరలు స్వల్పంగా పెరగడం గమనార్హం.
పాకిస్థాన్లో కొత్త ధరలు ఇవే..
పాక్ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ తగ్గింపు తర్వాత అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.403.78 వద్దకు చేరగా, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరు రూ.402.78 కి దిగొచ్చింది. తగ్గించిన ఈ కొత్త ధరలు మే 23 (శనివారం) నుండి అమల్లోకి వచ్చాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఇలా వరుసగా ఇంధన ధరలను తగ్గించడం ఇది రెండో వారం. అంతకుముందు వారంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 చొప్పున తగ్గించారు. సాధారణంగా పెట్రోల్ను ద్విచక్ర వాహనాలు, రిక్షాలు, చిన్న ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువగా వాడటం వల్ల ఈ తగ్గింపు అక్కడి మధ్యతరగతి ప్రజల బడ్జెట్కు కాస్త ఊరటనివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రవాణా రంగం, భారీ జనరేటర్లలో వాడే హై – స్పీడ్ డీజిల్ ధర తగ్గడం కూడా మార్కెట్కు సానుకూల అంశమే అని చెబుతున్నారు.
Also Read
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
- Pakistan: విదేశీ మహిళలపై పాక్ ఉప ప్రధాని మనవడి గ్యాంగ్ రేప్.
ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ వేదికగా అమెరికా – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మొదలైన తర్వాత, పాక్ ప్రభుత్వం తొలుత మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి లీటరుకు ఏకంగా 55 రూపాయలు పెంచింది. ఆ తర్వాత ఏప్రిల్ 2న పెట్రోల్పై 43 శాతం, డీజిల్పై 55 శాతం మేర చారిత్రాత్మక పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటి నుంచి పాక్ సర్కార్ ప్రతి శుక్రవారం ఇంధన ధరలను సమీక్షిస్తూ వస్తోంది.
భారత్లో మాత్రం పెరుగుదల.. సీఎన్జీ కూడా అప్!
మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో భారతదేశంలో ఇంధన ధరలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అయితే పాకిస్థాన్తో పోలిస్తే భారత్లో ఈ భారం చాలా తక్కువగా ఉంది. దేశంలో మూడు దఫాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారుగా రూ.5 మేర పెరిగాయి. శనివారం కూడా చమురు కంపెనీలు ధరలను సవరించాయి. పెట్రోల్ ధరపై 87 పైసలు, డీజిల్ ధరపై 91 పైసలు పెరిగింది. వీటితో పాటు వాహనదారులకు షాక్ ఇస్తూ సీఎన్జీ (CNG) ధరలను కూడా రూ.1 మేర పెంచారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!