Pakistan: “9/11 దాడుల్ని” గుర్తుకు తెచ్చిన పాక్ ఎయిర్లైన్ పోస్ట్.. విచారణకు ఆదేశించిన పీఎం షెహబాజ్..
- 9/11 ఉగ్రదాడుల్ని తలపించేలా పాక్ ఎయిర్ లైన్ యాడ్..
- నవ్వుల పాలైన పాకిస్తాన్..
- దీనిపై దర్యాప్తుకు పాక్ పీఎం ఆదేశం..
Pakistan: అమెరికా ట్విన్ టవర్స్పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్లోని ఈఫిల్ టవర్ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ని ఏకిపారేశారు.
జనవరి 10న పీఐఏ తన ఎక్స్లో.. ఫ్రాన్స్ జెండా బ్యాక్గ్రౌండ్గా ఈఫిల్ టవర్ వైపు వెళ్తున్న పీఐఏ విమానం ఉన్న ఫోటోని షేర్ చేసి..‘‘పారిస్ మేము ఈ రోజు వస్తున్నాం’’ అంటూ కామెంట్స్ రాసింది. ఇది 9/11 దాడుల్ని గుర్తుకు తెచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని రోజుల్లోనే 21 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
Also Read
- Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
Read Also: Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..
అయితే, ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ప్రకటనను ఎవరు రూపొందించారో దర్యాప్తు చేయాలని ప్రధాని అధికారుల్ని ఆదేశించినట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అన్నారు. నాలుగేళ్ల నిషేధం అనంతరం, పీఐఏ విమానం జనవరి 10న పారిస్లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.
— PIA (@Official_PIA) January 10, 2025
తాజావార్తలు
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
-
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!