Pakistan: పాకిస్తాన్లో సోషల్ మీడియాపై నిషేధం.. మొహర్రం కోసం కీలక నిర్ణయం..!
- మొహర్రం నేపథ్యంలో పాక్లో సోషల్ మీడియాపై బ్యాన్..
- ఉగ్రవాదుల్ని అడ్డుకోవడానికి ప్లాన్..
- పీఎం షరీఫ్ నిర్ణయం కోసం వెయిటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్ బ్యాన్పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం.. ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు వీటిపై బ్యాన్ కోరింది. షియా ముస్లింలు ప్రవక్త మనవడి బలిదానం కోసం పెద్ద ఎత్తున మొహర్రం పండగను నిర్వహిస్తారు. ముస్లింలు అతని బలిదానాన్ని నిరంకుశత్వానికి ప్రతిఘటనగా భావిస్తారు. షియా ముస్లింలు మొహర్రం మొదటి పది రోజులలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఇవి ఈ నెల 9, 10 తేదీల్లో భారీ ఊరేగింపులతో ముగుస్తుంది.
Read Also: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ఇదిలా ఉంటే పాకిస్తాన్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువ. మైనారిటీ వర్గంగా ఉన్న షియా కమ్యూనిటీపై అక్కడి తీవ్రవాద సున్నీ గ్రూపులు తరుచుగా బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదులు షియాలను మత అవిశ్వాసులుగా ముద్ర వేస్తున్నారు. అయితే, వీరి నుంచి పాక్ ప్రభుత్వం భద్రతా చర్యల్ని చేపట్టింది. ఇందులో ఉగ్రవాద చర్యల్ని నియంత్రించడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా సేవలను నిలిపివేస్తోంది. మతపరమైన హింసను నిరోధించడానికి తప్పుడు సమాచారం మరియు ద్వేషపూరిత పదార్థాల వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 6 నుండి 11 వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం, ఆ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, టిక్టాక్ మొదలైనవాటిని పంజాబ్ ప్రావిన్స్ అంతటా సస్పెండ్ చేయాని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం కోరింది. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.
తాజావార్తలు
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..