Pakistan: పాకిస్తాన్లో సోషల్ మీడియాపై నిషేధం.. మొహర్రం కోసం కీలక నిర్ణయం..!
- మొహర్రం నేపథ్యంలో పాక్లో సోషల్ మీడియాపై బ్యాన్..
- ఉగ్రవాదుల్ని అడ్డుకోవడానికి ప్లాన్..
- పీఎం షరీఫ్ నిర్ణయం కోసం వెయిటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్ బ్యాన్పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం.. ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు వీటిపై బ్యాన్ కోరింది. షియా ముస్లింలు ప్రవక్త మనవడి బలిదానం కోసం పెద్ద ఎత్తున మొహర్రం పండగను నిర్వహిస్తారు. ముస్లింలు అతని బలిదానాన్ని నిరంకుశత్వానికి ప్రతిఘటనగా భావిస్తారు. షియా ముస్లింలు మొహర్రం మొదటి పది రోజులలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఇవి ఈ నెల 9, 10 తేదీల్లో భారీ ఊరేగింపులతో ముగుస్తుంది.
Read Also: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ఇదిలా ఉంటే పాకిస్తాన్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువ. మైనారిటీ వర్గంగా ఉన్న షియా కమ్యూనిటీపై అక్కడి తీవ్రవాద సున్నీ గ్రూపులు తరుచుగా బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదులు షియాలను మత అవిశ్వాసులుగా ముద్ర వేస్తున్నారు. అయితే, వీరి నుంచి పాక్ ప్రభుత్వం భద్రతా చర్యల్ని చేపట్టింది. ఇందులో ఉగ్రవాద చర్యల్ని నియంత్రించడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా సేవలను నిలిపివేస్తోంది. మతపరమైన హింసను నిరోధించడానికి తప్పుడు సమాచారం మరియు ద్వేషపూరిత పదార్థాల వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 6 నుండి 11 వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం, ఆ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, టిక్టాక్ మొదలైనవాటిని పంజాబ్ ప్రావిన్స్ అంతటా సస్పెండ్ చేయాని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం కోరింది. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!