Pakistan: పాకిస్తాన్లో సోషల్ మీడియాపై నిషేధం.. మొహర్రం కోసం కీలక నిర్ణయం..!
- మొహర్రం నేపథ్యంలో పాక్లో సోషల్ మీడియాపై బ్యాన్..
- ఉగ్రవాదుల్ని అడ్డుకోవడానికి ప్లాన్..
- పీఎం షరీఫ్ నిర్ణయం కోసం వెయిటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మొహర్రం పండగ సందర్భంగా పాకిస్తాన్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతోంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్ బ్యాన్పై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం.. ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు వీటిపై బ్యాన్ కోరింది. షియా ముస్లింలు ప్రవక్త మనవడి బలిదానం కోసం పెద్ద ఎత్తున మొహర్రం పండగను నిర్వహిస్తారు. ముస్లింలు అతని బలిదానాన్ని నిరంకుశత్వానికి ప్రతిఘటనగా భావిస్తారు. షియా ముస్లింలు మొహర్రం మొదటి పది రోజులలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఇవి ఈ నెల 9, 10 తేదీల్లో భారీ ఊరేగింపులతో ముగుస్తుంది.
Read Also: Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ఇదిలా ఉంటే పాకిస్తాన్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువ. మైనారిటీ వర్గంగా ఉన్న షియా కమ్యూనిటీపై అక్కడి తీవ్రవాద సున్నీ గ్రూపులు తరుచుగా బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదులు షియాలను మత అవిశ్వాసులుగా ముద్ర వేస్తున్నారు. అయితే, వీరి నుంచి పాక్ ప్రభుత్వం భద్రతా చర్యల్ని చేపట్టింది. ఇందులో ఉగ్రవాద చర్యల్ని నియంత్రించడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా సేవలను నిలిపివేస్తోంది. మతపరమైన హింసను నిరోధించడానికి తప్పుడు సమాచారం మరియు ద్వేషపూరిత పదార్థాల వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 6 నుండి 11 వరకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని పంజాబ్ ప్రభుత్వం, ఆ దేశ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, టిక్టాక్ మొదలైనవాటిని పంజాబ్ ప్రావిన్స్ అంతటా సస్పెండ్ చేయాని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం కోరింది. శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!