Pakistan: పాకిస్తాన్లో మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్లు.. లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయాల్లో 237.5కు చేరింది. ఇదిలా ఉంటే లీటర్ డిజిల్ ధరను పీకేఆర్ 4.25కి తగ్గించింది. కిరోసిన్ ధరను పీకేఆర్ 8.30కి తగ్గించింది.
Read Also: S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార`ం ఉంది!
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో శ్రీలంక అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మన మిత్రులు కూడా పాకిస్తాన్ దేశాన్ని అడుక్కునే దేశంగా భావిస్తున్నారంటూ.. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితి చూపాయి. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల సంభవించిన వరదలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింతగా దెబ్బతీసింది. అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతుంది. ఈ వరదల్లో 1500 మందికి పైగా ప్రజలు మరణించారు. 3.3 కోట్ల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. సింధు ప్రావిన్సు, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంక్వాలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) రోడ్డుకూడా చాలా ప్రాంతాల్లో ధ్వంసం అయింది.
పూర్తిగా వరదల ప్రభావం తగ్గడానికి రెండు నుంచి ఆరు నెలలు పడుతుందని.. ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న చైనా కూడా పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. సీపెక్ కింద అభివృద్ధి ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చైనా, పాకిస్తాన్ ను కోరుతోంది. గతంలో పాకిస్తాన్ ను అదుకున్న యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!