Pakistan: పాకిస్తాన్లో మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్లు.. లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయాల్లో 237.5కు చేరింది. ఇదిలా ఉంటే లీటర్ డిజిల్ ధరను పీకేఆర్ 4.25కి తగ్గించింది. కిరోసిన్ ధరను పీకేఆర్ 8.30కి తగ్గించింది.
Read Also: S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార`ం ఉంది!
Also Read
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో శ్రీలంక అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మన మిత్రులు కూడా పాకిస్తాన్ దేశాన్ని అడుక్కునే దేశంగా భావిస్తున్నారంటూ.. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితి చూపాయి. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల సంభవించిన వరదలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింతగా దెబ్బతీసింది. అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతుంది. ఈ వరదల్లో 1500 మందికి పైగా ప్రజలు మరణించారు. 3.3 కోట్ల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. సింధు ప్రావిన్సు, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంక్వాలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) రోడ్డుకూడా చాలా ప్రాంతాల్లో ధ్వంసం అయింది.
పూర్తిగా వరదల ప్రభావం తగ్గడానికి రెండు నుంచి ఆరు నెలలు పడుతుందని.. ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న చైనా కూడా పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. సీపెక్ కింద అభివృద్ధి ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చైనా, పాకిస్తాన్ ను కోరుతోంది. గతంలో పాకిస్తాన్ ను అదుకున్న యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!