Site icon NTV Telugu

Khawaja Asif: అదే జరిగితే భారత్ యుద్ధ విమానాలు సమాధి అవుతాయి.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Khawaja Asif

Khawaja Asif

ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar: కుల సర్వేలో ఆభరణాల ప్రశ్నకు నో చెప్పిన డీకే.శివకుమార్.. బీజేపీ రియాక్షన్ ఇదే!

తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏదైనా జరిగితే భారతదేశం, దాని యుద్ధ విమానాలు శిథిలాల కింద సమాధి అవుతాయని వ్యాఖ్యానించారు. ఆదివారం ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఏదైనా సైనిక వివాదం జరిగితే మాత్రం భారతదేశం యుద్ధ విమానాలు శిథిలాల కింద సమాధి అవుతాయని వ్యాఖ్యానించారు. భారత సైన్యం, రాజకీయ నాయకుల ప్రకటనలు విఫల ప్రయత్నం మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 0-6 స్కోరుతో ఇంత నిర్ణయాత్మక ఓటమి తర్వాత.. వారు మళ్లీ ప్రయత్నిస్తే.. దేవుడు ఇష్టపడితే మాత్రం.. ఆ స్కోరు మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సరిహద్దులను దాటే సామర్థ్యాన్ని పదేపదే ప్రదర్శించిందని గుర్తుచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలకోట్ వైమానిక దాడి, ఇటీవలి ఆపరేషన్ సిందూరే ఉదాహరణ అని పేర్కొన్నారు. పౌరులను రక్షించడానికి, భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి అవసరమైనప్పుడు దేశం ఏ సరిహద్దునైనా దాటగలదని.. ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించి చూపించిందని వ్యాఖ్యానించారు. సర్ క్రీక్ సెక్టార్‌లో ఇస్లామాబాద్ ఏదైనా దుస్సాహసం చేస్తే చరిత్ర, భౌగోళికం రెండింటినీ మార్చేంత బలమైన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ నాలుగు రోజుల పాటు తీవ్ర ఘర్షణలకు దారితీసింది. మే 10న ఇరుపక్షాలు సైనిక చర్యను నిలిపివేయాలని అంగీకరించడంతో యుద్ధం ఆగింది.

Exit mobile version