Boat Sink: వలసదారులతో వెళ్తున పడవ బోల్తా.. లిబియా తీరం 60 మంది గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది వలసదారులు గల్లంతయ్యారు. దాదాపుగా వీరంతా చనిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉత్తర ఆఫ్రికాలో తాజాగా ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) శనివారం తెలిపింది.
Read Also: Chicken Prices: మాంసప్రియలకు షాక్.. రోజు రోజుకు పెరిగిపోతున్న చికెన్ ధరలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
లిబియా వాయువ్య తీరంలోని జువారా నుంచి బయలు దేరిన పడవ, సముద్రంలో అలల కారణంగా మునిగిపోయినట్లు సమాచారం. నైజీరియ, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి మహిళలు, పిల్లలతో సుమారు 86 మంది వలసదారులు నౌకలో ఉన్నట్లు ఐఓఎం పేర్కొంది. వీరిలో 61 మంది గల్లంతవ్వగా.. 25 ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది. లిబియా, ట్యూనీషియా మీదుగా ఇటలీ ద్వారా ఐరోపాకు చేరుకునే వలసదారుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. ఇలా వెళ్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం, ట్యునీషియా మరియు లిబియా నుండి ఈ సంవత్సరం 1,53,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నారు.
మధ్యదరా సముద్రంలో ఈ ఏడాది ఇలా వెళ్లిన వారు 2250 మంది మరణించారు. జూన్ 14న నైరుతి గ్రీస్ లో 750 మందితో వెళ్తున్న ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సిరియా, పాకిస్తాన్, ఈజిప్టు దేశాలకు చెందిన చాలా మంది మరణించారు. కేవలం 104 మంది మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..