Boat Sink: వలసదారులతో వెళ్తున పడవ బోల్తా.. లిబియా తీరం 60 మంది గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Sink: అంతర్యుద్ధాలు, తీవ్రవాదం, హింస నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటూ ప్రతీ ఏడాది కొన్ని వేల మంది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారు సముద్రంలో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా మరోసారి లిబియా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. లిబియా మధ్యదరా సముద్ర తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 61 మంది వలసదారులు గల్లంతయ్యారు. దాదాపుగా వీరంతా చనిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉత్తర ఆఫ్రికాలో తాజాగా ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) శనివారం తెలిపింది.
Read Also: Chicken Prices: మాంసప్రియలకు షాక్.. రోజు రోజుకు పెరిగిపోతున్న చికెన్ ధరలు
Also Read
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
లిబియా వాయువ్య తీరంలోని జువారా నుంచి బయలు దేరిన పడవ, సముద్రంలో అలల కారణంగా మునిగిపోయినట్లు సమాచారం. నైజీరియ, గాంబియా, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి మహిళలు, పిల్లలతో సుమారు 86 మంది వలసదారులు నౌకలో ఉన్నట్లు ఐఓఎం పేర్కొంది. వీరిలో 61 మంది గల్లంతవ్వగా.. 25 ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎం తెలిపింది. లిబియా, ట్యూనీషియా మీదుగా ఇటలీ ద్వారా ఐరోపాకు చేరుకునే వలసదారుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. ఇలా వెళ్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం, ట్యునీషియా మరియు లిబియా నుండి ఈ సంవత్సరం 1,53,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నారు.
మధ్యదరా సముద్రంలో ఈ ఏడాది ఇలా వెళ్లిన వారు 2250 మంది మరణించారు. జూన్ 14న నైరుతి గ్రీస్ లో 750 మందితో వెళ్తున్న ఫిషింగ్ బోట్ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సిరియా, పాకిస్తాన్, ఈజిప్టు దేశాలకు చెందిన చాలా మంది మరణించారు. కేవలం 104 మంది మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తాజావార్తలు
-
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
-
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
Prabhas : షూటింగ్కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!