North Korea: K-పాప్, సినిమాలు షేర్ చేయడమే పాపం.. బహిరంగా మరణశిక్షలు విధిస్తున్న కిమ్..
- కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అరాచకం..
- శత్రు దేశాలు పాటలు విన్నందుకు మరణశిక్షలు..
- దక్షిణ కొరియా రిపోర్టులో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కిమ్, కిమ్ తాత, కిమ్ తండ్రి గురించి ప్రగల్భాలు పలకడంతోనే ఆ దేశం నడుస్తోంది. ప్రాపగండాలో అక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయం కూడా అక్కడి ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇక అక్కడ విచిత్రమైన చట్టాలు, శిక్షలు ఏ దేశంలో కూడా ఉండదు. అమెరికా, దక్షిణ కొరియా అంటే ద్వేషించి నార్త్ కొరియా, అక్కడి ప్రజలు ఈ రెండు దేశాలకు సంబంధించిన విషయాలతో సంబంధం ఉందని తెలిస్తే అక్కడి అధికారులు దారుణంగా చంపేస్తారు.
పలు సందర్భాల్లో కే-పాప్ మ్యూజిక్ విన్నందుకు, కొరియన్ సినిమాలు చూసినందుకు నిర్ధాక్షిణ్యంగా అక్కడి ప్రజలను ఉరితీయడం, బహిరంగంగా కాల్చి చంపడం వంటి శిక్షల్ని విధిస్తుంటుంది. సియోల్-2020 చట్టం ప్రకారం దక్షిణ కొరియా టీవీ సిరీస్లు, సినిమాలు, కే-పాప్ మ్యూజిక్ షేర్ చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు కిమ్ జోంగ్ ఉన్ పాలన బహిరంగంగా మరణశిక్ష విధించిందని దక్షిణకొరియా మంత్రిత్వ శాఖ జూన్ 27న తెలిపింది.
Also Read
Read Also: Delhi Rains : ఢిల్లీలో కుండపోత వర్షంపై ఐఎండీ అంచనా విఫలం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘‘2024 ఉత్తర కొరియా మానవ హక్కుల నివేదిక ప్రకారం’’, ఇటీవల కాలంలో బహిరంగ మరణశిక్షలు పెరిగాయని చెప్పింది. దక్షిణ కొరియాతో పాటు వెస్ట్రన్ దేశాలు, శత్రుదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం, ఇతరులతో పంచుకోవడం వంటివి చేస్తే ఉత్తరకొరియాలో మరణశిక్షలు విధిస్తుంది. 2022లో సౌత్ హ్వాంగ్హే ప్రావిన్స్లోని ఒక గనిలో 22 ఏళ్ల వ్యవసాయ కార్మికుడిని బహిరంగంగా మరణశిక్ష విధించినట్లు నివేదిక పేర్కొంది. నిందితుడు దక్షిణ కొరియాకు చెందిన 70 పాటలను విన్నందుకు, 3 సినిమాలు చూసినందుకు వారిని అరెస్ట్ చేశారు. అతను మరో ఏడుగురికి వీటిని షేర్ చేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు.
మొదటగా ఈ మెటీరియల్ తీసుకువచ్చిన వ్యక్తులకు కఠిన శిక్షల ఉంటాయి. ఫైరింగ్ స్వ్కాడ్ ద్వారా వీరిని బహిరంగంగా కాల్చి చంపుతారు. ఆ తర్వాత దీంట్లో ఉన్నవారి తప్పును బట్టి శిక్ష విధిస్తున్నారు. 2023 నాటికి ఉత్తర కొరియా విడిచి పారిపోయిన 649 మంది సాక్ష్యాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!