Nobel prize: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు
- ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు
- డారెన్ అసెమోగ్లు. సైమన్ జాన్సన్.. జేమ్స్ ఎ. రాబిన్సన్లకు నోబెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ఇంకా కొనసాగుతోంది. సోమవారం ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ముగ్గురికి బహుమతులను అందించనుంది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకుగాను డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్సన్లకు నోబెల్ బహుమతులను ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Musi River : ప్రభుత్వానికి షాక్.. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు
Also Read
అర్థశాస్త్రంలో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను సోమవారం వెల్లడించారు. డారెన్, సైమన్.. అమెరికాలో కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు కాగా.. రాబిన్సన్ షికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.
ఇది కూడా చదవండి: AP Liquor Shops Lottery: లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!
వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం మరియు శాంతికి సంబంధించి గత వారం నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. ఎకనామిక్స్ బహుమతి ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్ విద్యావేత్తలచే ఆధిపత్యం చెలాయించబడింది. అయితే యుఎస్ ఆధారిత పరిశోధకులు కూడా గత వారం 2024 గ్రహీతలను ప్రకటించిన శాస్త్రీయ రంగాలలో విజేతలలో ఎక్కువ మందిని కలిగి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kinnera Mogilaiah: పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!