Nobel Peace Prize : ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతి ఎవరికి దక్కిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize : ప్రపంచ శాంతి కోసం పాటు పడే వ్యక్తులకు ప్రతేడాది నోబుల్ శాంతి బహుమతి అందిస్తారు. ఈ ఏడాది బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ లను 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. తమ దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందిస్తోన్న సేవలకు గానూ ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
Read Also: Ola Uber Services: 3రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులు బంద్
Also Read
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎన్నో ఏళ్లుగా అధికారాన్ని విమర్శించే హక్కును ప్రచారం చేయడంతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది.
Read Also: Kanika Dhillon: వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. రాఘవేంద్ర రావు మాజీ కోడలు షాకింగ్ కామెంట్స్
యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం వంటివాటిపై పత్రాలు సమర్పించడంలో ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. శాంతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో పౌర సమాజ ప్రాముఖ్యతను చాటి చెప్పారని నోబెల్ కమిటీ చెప్పింది. ఆయా కారణాల వల్ల అలెస్ బిలియాట్స్కీతో పాటు పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారని వివరించింది.
తాజావార్తలు
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..