New York: న్యూయార్క్ లో ఇకపై దీపావళి నాడు స్కూళ్లకు హాలిడే.. ప్రకటించిన మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New York: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన దేవాలయాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో నిర్మించారు. అలాగే విదేశాల్లో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో భారతీయ పండుగలను సైతం జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో దీపావళి పండుగకు సెలవు ఇవ్వాలని కామన్స్ సభలో ప్రైవేటు తీర్మానం ప్రవేశ పెట్టారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే దీపావళి నాటికి అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇపుడు న్యూయార్క్ లో సైతం దీపావళి పండుగకు స్కూల్స్ కు సెలవు ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు.
Read also: TS Congress: స్ట్రాటజీ మీట్కు15 మందికి మాత్రమే పిలుపు.. సీనియర్ల అసంతృప్తి..!!
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ లో సైతం ప్రాధాన్యత కల్పించబడింది. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు సైతం ఈ పండుగను ఏటా ఎంతో సందడిగా జరుపుకుంటారు. హిందువులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ మేయర్ ప్రాధాన్యత కల్పించారు. దీపావళి పర్వదినాన న్యూయార్క్లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు.
Read also: Red Banana: రెడ్ బనానా సాగులో పాటించాల్సిన మెళుకువలు..!
న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో తాను భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్కుమార్.. సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యిందని మేయర్ ఎరిక్ అన్నారు. న్యూయార్క్ నగరంలోని స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్ రాజ్కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల తన పోరాటం తర్వాత ఈ విషయంలో విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని జెనిఫెర్ రాజ్కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..