Earth Water: భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం ఇదే..
- భూమి పైకి నీరు ఎలా వచ్చింది..?
- నాసా జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు..
- ఉల్కల పాత్ర తక్కువే అనే అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth Water: ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి. ఇలాంటి సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి నాసా అధ్యయనం సమాధానం ఇస్తోంది. భూమిపై ఉన్న నీటిలో ఎక్కువ భాగం గ్రహం ఏర్పడినప్పుడే ఉన్న మూల పదార్థాల నుంచి వచ్చిందని నాసా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. 4 బిలియన్ ఏళ్లలో ఉల్కలు భూమికి తీసుకువచ్చిన నీటి పరిమాణం చాలా తక్కువ అని ఈ పరిశోధన వెల్లడించింది.
Read Also: Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
అపోలో మిషన్ల సమయంలో చంద్రుడి నుంచి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషిస్తూ, ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు చెందిన సైంటిస్ట్ టోనీ గార్గానో నేతృత్వం వహించారు. చంద్రుడి మట్టిలో కనీసం 1 శాతం వరకు కార్బన్ అధికంగా ఉన్న ఉల్కల పదార్థం ఉన్నట్లు తేలింది. ఈ ఉల్కలు చంద్రుడిని ఢీకొన్నప్పుడు కొంత వరకు ఆవిరైపోయాయని పరిశోధకులు గుర్తించారు. భూమి మీద ఉల్కల ప్రభావం చంద్రుడితో పోలిస్తే సుమారు 20 రెట్లు ఎక్కువగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్నా, ఉల్కల ద్వారా భూమికి చేరిన నీటి పరిమాణం చాలా స్వల్పమేనని ఈ అధ్యయనం తేల్చింది.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ట్రిపుల్ ఆక్సిజన్ ఐసోటోప్స్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఉల్కలు ఢీకొన్న సమయంలో తీవ్రమైన వేడి, ఆవిరీకరణ జరిగినా, ఆక్సిజన్ ఐసోటోప్స్ మారకుండా ఉండటం వల్ల, అవి ఉల్కల నుంచి వచ్చిన పదార్థాన్ని గుర్తించడానికి కీలక ఆధారంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిలియన్ ఏళ్లుగా భూమి పరిసర ప్రాంతంలో ఏ రకమైన ఉల్కలు పడ్డాయనే ఆధారాలను చంద్రుడి మట్టే అందిస్తుందని, భూమిపై భూగర్భ కదలికలు, వాతావరణ ప్రభావం ఈ చరిత్రను చెరిపేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడి ధ్రువాల వద్ద నీరు ఉందని ఇప్పటికే గుర్తించారు. ఇది నాసా నిర్వహిస్తున్న ఆర్టెమిస్ మిషన్లకు కీలకం అవుతుంది. ఈ అధ్యయనం 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి అపోలో మిషన్ల ద్వారా తీసుకువచ్చిన మట్టితో చేశారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!