Netanyahu: నెతన్యాహుకు అవమానం.. ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగం..
- నెతన్యాహుకు అవమానం..
- ఐరాసలో ఖాళీ కుర్చీలను చూస్తూనే ప్రసంగం..
- నెతన్యాహూ స్పీచ్ సమయంలో ప్రతినిధుల వాకౌట్..
- కొన్ని దేశాల తీరుపై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ, ఇజ్రాయిల్ గాజాలో ‘‘పనిని పూర్తి చేస్తుంది’’, సాధ్యమైనంత త్వరగా చేస్తుందని ప్రకటించారు. తన ప్రసంగాన్ని పాలస్తీనియన్లు అందరు వినాలని గాజా స్ట్రిప్ చుట్టూ లౌడ్ స్పీకర్లు ఉంచాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని నెతన్యాహూ ఆదేశించారు. అరబ్, ముస్లిం దేశాల నుంచి దాదాపు అందరు ప్రతినిధులు ప్రసంగం సమయంలో వాకౌట్ చేశారు. అనేక ఆఫ్రికన్ దేశాలు, యూరప్ దేశాల ప్రతినిధులు కూడా బయటకు వెళ్లారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
దీనికి ముందు ఒక రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్కు వీసా నిరాకరించింది. దీంతో ఆయన జనరల్ అసెంబ్లీలో రిమోట్గా ప్రసంగించారు. ప్రజలు ఎన్ని బాధలు అనుభవించినా, పాలస్తీనియన్లు గాజాను ఎప్పటికీ వదిలి వెళ్లరని అన్నారు. ఇజ్రాయిల్ నిఘా విభాగం గాజా అంతటా వినిపించేలా నెతన్యాహు ప్రసంగాన్ని ప్రసారం చేసింది. హమాస్ నాయకులు లొంగిపోవాలని, ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను వదిలేయాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్ను విమర్శిస్తున్న దేశాలకు నెతన్యాహూ చాటా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పక్షపాత మీడియా, రాడికల్ ఇస్లామిస్ట్, సెమిటిక్ వ్యతిరేక మూకలకు వారు లొంగిపోయారని అన్నారు. ‘‘పరిస్థితులు కఠినంగా మారినప్పుడు, ధైర్యవంతులు ముందుకు సాగుతారు. కానీ ఇక్కడ చాలా దేశాలు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, వెనక్కి తగ్గి లొంగిపోయారు’’ అని నెతన్యాహూ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..