Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
- గాజాలో గాయాలపాలైన అనేక మంది నిరాశ్రయులు..
- గతవారం మూడు స్కూళ్లపై దాడి చేసిన ఇజ్రాయెల్ సైన్యం..
- హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా పని చేస్తున్నాయనే డౌట్ తో దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అలాగే, చాలా మంది గాయపడినట్లు పాలస్తీనా అధికార వార్తా సంస్థ తెలిపింది. గత వారం కూడా మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు పేర్కొనింది. అయితే, ఆగస్టు 4వ తేదీన గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న స్కూల్ పై జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి చేయడా 17 మంది మృతి చెందారు. ఇక, ఆగస్టు 1న దలాల్ అల్- ముఘ్రాబీ స్కూల్పై దాడి చేయగా.. అందులో 15 మంది మృత్యువాత పడ్డారు.
Read Also: Delhi Deputy CM Post: మరోసారి మనీష్ సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవి..?
Also Read
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
- UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
- Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
- Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
అయితే, గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్లో టెరర్రిస్టులు నరమేధం సృష్టించి వందలాది మందిని హత్య చేశారు. నాటి నుంచి హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. సైనిక దాడిని స్టార్ట్ చేసినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని బిల్డింగ్ లపై దాడులు చేసుకుంటూ వస్తుంది. ఉగ్రవాదులు ఉంటున్నారని డౌట్ వచ్చిన స్కూల్స్పై దాడులకు కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కాగా, గత 10 నెలల సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంచనా.
తాజావార్తలు
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!