China: భారత్పై అదే అక్కసు.. జీ20, పేరు మార్పుపై డ్రాగన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో అగ్రదేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడిని చూసి డ్రాగన్ కంట్రీ చైనా తట్టుకోలేకపోతోంది. చైనా తన మౌత్పీస్ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా భారతదేశంపై విషాన్ని చిమ్మే కథనాలను ప్రచురిస్తోంది. భారతదేశం అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందకు జీ20 సదస్సును ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించింది.
దేశం పేరు మార్చడం కన్నా ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని గ్లోబల్ టైమ్స్ లో పేర్కొంది. 1947కి ముందు దేశం స్వాతంత్య్రం పొందిన నాటి ఆర్థిక వ్యవస్థను భారతదేశం సమగ్రంగా సంస్కరించగలదా..? అనేదే ముఖ్యమైన విషయమని, విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదని అంది. భారత్ పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ఉపయోగించుకుని దాన్ని వృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆశిస్తున్నాము అంటూ చైనా పేర్కొంది.
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
Read Also: Rahul Gandhi: జీ20 సదస్సుకు ముందు రాహుల్ గాంధీ యూరప్ పర్యటన
రాబోయే జీ20 సమ్మిట్ పై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైన తరుణంలో భారత్ ప్రపంచాన్ని ఏం తెలియజేయాలని అనుకుంటుంది..? అని చైనా ప్రశ్నించింది. పేరు మార్పు వలస రాజ్యాల కాలం పేర్లుగా భావించే వాటిని తొలగించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని తన మీడియాలో చెప్పింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మోడీ పరిపాలన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాల్లో ఒకటిగా ఉందని, భారత్ తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించడానికి పెద్ద సంస్కరణల్ని ప్రారంభించిందని.. అయితే దురదృష్టవశాత్తు వాణిజ్య రక్షణవాదం వైపు ఎక్కువగా మారుతోందని చైనా తన నివేదికలో పేర్కొంది. దేశం పేరు మార్చాలా..? వద్దా..? అనే దానికన్నా ముందు ఇవి ముఖ్యమైనవంటూ సూచించింది.
ఇటీవల కాలంలో చైనా కంపెనీలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో.. ప్రపంచానికి తన మార్కెట్లను పూర్తిగా తెరవడంతలో భారత్ సంకోచం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. జీ20 ప్రెసిడెన్సీపై సలహాలు ఇస్తూ.. భారత్ తన ఆర్థిక వ్యవస్థను సంస్కరించుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , విదేశీ పెట్టుబడిదారులకు న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని అందించడానికి జీ20ని ఉపయోగించుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?
-
TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర