ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన మెలోని.. భారత్-ఇటలీ సంబంధాలు “గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
మోడీకి మెలోని ధన్యవాదాలు
ఎక్స్ వేదికగా మెలోని స్పందిస్తూ.. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. మోడీతో ఉన్న స్నేహాన్ని కూడా ప్రస్తావించారు. “ప్రియమైన నరేంద్ర మోడీ.. మీ మాటలకు, మీ స్నేహానికి ధన్యవాదాలు. భారత్, ఇటలీ మధ్య సంబంధాలు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. భారత్, ఇటలీ మధ్య ఇటీవల ప్రారంభించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రెండు దేశాల మధ్య బంధం ప్రాధాన్యతను తెలియజేస్తోందని గుర్తుచేశారు. ఇరు దేశాల నైపుణ్యాలను కలిపి కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.
మెలోనికి మోడీ శుభాకాంక్షలు
అంతకుముందు ప్రధాని మోడీ.. జార్జియా మెలోని చారిత్రక ఘనత సాధించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం వరుసగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేతగా మెలోని నిలిచారని పేర్కొన్నారు. ఈ ఘనత ఇటలీ ప్రజలకు మెలోని నాయకత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు. భారత్-ఇటలీ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను బలోపేతం చేయడంలో మెలోని స్నేహం కీలకంగా ఉందని పేర్కొన్నారు. భారత్, ఇటలీ ప్రజల కోసం సంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు మెలోనితో కలిసి సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆమె భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు చెప్పారు.
Grazie, caro @narendramodi, per le tue parole e per la tua amicizia.
Il rapporto tra Italia e India è oggi più forte che mai 🇮🇹🇮🇳Il Partenariato Strategico Speciale che abbiamo lanciato durante il nostro ultimo incontro è il riconoscimento dell’importanza di questo legame e… https://t.co/7xQgo7RbvH
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026

