Miss World: భారత్లో ప్రపంచ సుందరి పోటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss World: అందాల పోటీకి భారత్ మరోసారి వేదిక కాబోతోంది. ప్రపంచ సుందరి-2023 పోటీలను ఇండియాలో నిర్వహించాలని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విషయాలను నిర్వహకులు గురువారం మీడియాకు తెలిపారు. సుమారు 27 సంవత్సరాల తరువాత మరోసారి ఇండియాలో 71వ ప్రపంచ సుందరీ-2023 పోటీలు జరగనున్నాయి.
Read also:Nirmala Sitharaman : నిరాడంబరంగా నిర్మలమ్మ బిడ్డ పెళ్లి.. వీఐపీలెవరూ లేరు
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
మరోసారి భారత్లో ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. సుమారు 27 సంవత్సరాల తరువాత భారత్ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. 1996లో ప్రపంచ సుందరి అంతర్జాతీయ పోటీలకు ఇండియా వేదికగా అయింది. మళ్లీ ఇన్నాళ్లకు 71వ ప్రపంచ సుందరి-2023 ఫైనల్ పోటీలు నవంబర్ నెలలో ఇండియాలో జరగనున్నాయి. అయితే ఫైనల్ తేదిలు ఖరారు కావల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. 130 దేశాల ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారని తెలిపారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయన్నారు. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వాటి ఉద్దశమని మోర్లే తెలిపారు. 2022 ప్రపంచ సుందరి విజేత కరోలినా బిలావ్స్కా మాట్లాడుతూ అందమైన ఇండియాలో తన కిరిటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని చెప్పారు. 2023 ప్రపంచ సుందరి పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి కూడా మీడియాతో మాట్లాడారు.
Read also: Nirmala Sitharaman : నిరాడంబరంగా నిర్మలమ్మ బిడ్డ పెళ్లి.. వీఐపీలెవరూ లేరు
ఇప్పటి వరకు ఇండియాకు చెందిన మహిళలు ఆరుసార్లు ప్రపంచ సుందరి పోటీల్లో విజేతలుగా నిలిచారు. రీటా ఫరియా(1966), ఐశ్వర్యారాయ్(1994), డయానా హెడెన్(1997), యుక్తాముఖి(1999), ప్రియాంకా చోప్రా(2000), మానుషి చిల్లర్(2017) వీరందరూ ఇప్పటి వరకు ప్రపంచ సుందరీమణులుగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!