India-China: చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం.. టిబెల్లోని 30 ప్రదేశాలకు పేర్లు మార్చనున్న భారత్..
- చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం..
- టిబెట్లోని పలు ప్రదేశాలకు పేర్లు..
- గతంలో అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా పేర్లు
India-China: డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ గట్టి సమాధానం ఇస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదే అని పదేపదే భావించే చైనా, ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడం పరిపాటిగా మారింది. అయితే, దెబ్బకుదెబ్బగా భారత్ కూడా టిబెట్లోని 30 ప్రాంతాలకు పేర్లు మార్చాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేబినెట్ టిబెట్ ప్రాంతంలోని 30 ప్రాంతాలకు పేరు మార్చాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే భారత్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ పెట్టాలనుకుంటున్న ఈ పేర్లు చారిత్రక పరిశోధన, టిబెట్ ప్రాంతానికి సంబంధించిన సంబంధాల ఆధారంగా భారత సైన్యం ద్వారా ప్రచురించబడుతుంది. వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంట వారి మ్యాప్లలో అప్డేట్ చేస్తారు. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని మొత్తం 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గము ఈ జాబితాలో ఉన్నాయి. చైనా గతంలో 2017 నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఆ సమయంలో భారత్ తమ తీవ్ర నిరసన తెలిపింది. అరుణాచల్ భారత్లో అవిభాజ్యం భాగమని చెప్పింది.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Read Also: UGC: యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు..యూజీసీ సంచలన నిర్ణయం..
టిబెట్ ప్రాంతాన్ని చైనా బలవంతంగా ఆక్రమించిన తర్వాత, భారత్ ఈ భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా అంగీకరించింది. అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం చైనా పేర్లు మార్చే విధానంలో దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 5, 2020లో పాంగాంగ్త్సో సరస్సు, గాల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరు పక్షాలు ఈ సైనిక ప్రతిష్టంభనను తగ్గించేందుకు 21 సార్లు చర్చించాయి. భారత్ టిబెట్లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను క్లెయిమ్ చేసే లక్ష్యాన్ని నొక్కిచెప్పనుంది.
ఇటు భారత్ సరిహద్దుల్లో, అటు దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. దీని ద్వారా చైనాకు గట్టి సందేశం ఇవ్వాలని భావిస్తోంది. జూన్ 11న విదేశాంగ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఎస్ జైశంకర్ చైనా మరియు పాకిస్థాన్లకు సంబంధించిన సమస్యలపై భారతదేశం యొక్క బలమైన వైఖరిని పునరుద్ఘాటించారు. సరిహద్దు సమస్యలు, సీమాంతర ఉగ్రవాదం రెండింటినీ భారత్ దృఢంగా పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!