Maldives: “మా బోట్లను ఇండియన్ ఆర్మీ ఎందుకు అడ్డగించింది”.. భారత్ని వివరణ కోరిన మాల్దీవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు కదుపుతున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా మాల్దీవులు-భారత్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మాల్దీవులకు ఎకనామిక్ జోన్ సముద్రంలో చేపలు పడుతున్న మూడు బోట్లను భారత ఆర్మీ అడ్డగించిందని, ఇందుకు వివరణ ఇవ్వా్ల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా భారత్ని వివరాలను కోరింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లేదు. జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని హాలీఫు అటోల్కి ఈశాన్యంగా 72 నాటికన్ మైళ్ల దూరంలోని మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో చేపల వేటలో ఉన్న మాల్దీవుల బోట్లను భారత సైన్యం అడ్డగించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
Read Also: Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!
అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ, ముందస్తు సమాచారం లేదకుండా భారత సైనికులు తమ ఫిషింగ్ బోట్లను ఎక్కారని మాల్దీవులు ఆరోపిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వాన్ని సమగ్ర వివరాలను కోరింది. తమ బోట్లను విచారించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బోర్డింగ్ టీమ్స్ బాధ్యత వహించాలని ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారతీయ సైనిక సిబ్బంది ఉంది. రెండు హెలికాప్టర్ల సాయంతో మాల్దీవుల ప్రజలకు వైద్య సేవల్ని అందిస్తోంది. అయితే, వీరిని ఉపసంహరించుకోవాలని మాల్దీవులు భారత్ని కోరుతోంది. దీనిపై ఇరు దేశాలు రెండుసార్లు చర్చించాయి. మరోవైపు భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!