Maldives: “మా బోట్లను ఇండియన్ ఆర్మీ ఎందుకు అడ్డగించింది”.. భారత్ని వివరణ కోరిన మాల్దీవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు కదుపుతున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా మాల్దీవులు-భారత్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మాల్దీవులకు ఎకనామిక్ జోన్ సముద్రంలో చేపలు పడుతున్న మూడు బోట్లను భారత ఆర్మీ అడ్డగించిందని, ఇందుకు వివరణ ఇవ్వా్ల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా భారత్ని వివరాలను కోరింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లేదు. జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని హాలీఫు అటోల్కి ఈశాన్యంగా 72 నాటికన్ మైళ్ల దూరంలోని మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో చేపల వేటలో ఉన్న మాల్దీవుల బోట్లను భారత సైన్యం అడ్డగించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Read Also: Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!
అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ, ముందస్తు సమాచారం లేదకుండా భారత సైనికులు తమ ఫిషింగ్ బోట్లను ఎక్కారని మాల్దీవులు ఆరోపిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వాన్ని సమగ్ర వివరాలను కోరింది. తమ బోట్లను విచారించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బోర్డింగ్ టీమ్స్ బాధ్యత వహించాలని ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారతీయ సైనిక సిబ్బంది ఉంది. రెండు హెలికాప్టర్ల సాయంతో మాల్దీవుల ప్రజలకు వైద్య సేవల్ని అందిస్తోంది. అయితే, వీరిని ఉపసంహరించుకోవాలని మాల్దీవులు భారత్ని కోరుతోంది. దీనిపై ఇరు దేశాలు రెండుసార్లు చర్చించాయి. మరోవైపు భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!