Joe Biden: డర్టీ బాంబ్ రచ్చ.. రష్యాకి బైడెన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden Gives Strong Warning To Russia Over Dirty Bomb: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్పై అణు బాంబును ప్రయోగిస్తే.. రష్యా క్షమించరాని తప్పిదం చేసినట్లే అవుతుందని హెచ్చరించారు. డర్టీ బాంబ్(అణు బాంబ్)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో.. మంగళవారం వైట్ హౌస్లో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తనకు తెలియదన్న జో బైడెన్.. ఒకవేళ ఉక్రెయిన్పై రష్యా డర్టీ బాంబ్ ప్రయోగిస్తే మాత్రం ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు.
కాగా.. ఇటీవల ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపిణలు చేయగా, ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని రివర్స్లో రష్యా ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో దాడి చేసేందుకు రెడీ అవుతోందని.. సొంత ప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి, దాన్ని తమ మీద తోసేందుకు కుట్ర పన్నుతోందని రష్యా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము ఖేర్సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తున్నామని.. డర్టీ బాంబ్ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని పేర్కొంది. అయితే.. రష్యా చేసిన ఈ ఆరోపణలను నాటో దేశాలు ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచేందుకే.. రష్యా ఈ తరహా ఆరోపణలకు దిగిందని మండిపడ్డాయి.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ఇదిలావుండగా.. ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా, ఈమధ్య ఉక్రెయిన్పై దాడులు మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మిలిటరీ మొబిలైజేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రష్యా-క్రిమియా బ్రిడ్జిపై ఉక్రెయిన్ దాడులు చేయడంతో.. అందుకు ప్రతీకారంగా రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో కీవ్లోని ప్రభుత్వ కార్యాలయాలు, కీలక భవనాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది చనిపోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి