Japan: జపాన్ అంతరిక్ష ప్రయోగం విఫలం.. రాకెట్ ఇంజిన్ పరీక్షల్లోనే పేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: ఈ మధ్య కాలంలో అంతరిక్షంలోకి రాకెట్లను పంపించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఇండియా శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతోంది. ఇలాంటి ప్రయోగాలను చేయాలని ఇతర దేశాలు కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జపాన్ దేశం జరపతలపెట్టిన అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొన్నట్టు ఆ దేశ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్ రాకెట్ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్-ఎస్( Epsilon S) పేరిట సిద్ధం చేసింది. ఇపుడు అది కూడా ప్రమాదానికి గురైనట్టు స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
Read also: Honda Dio 125 Price: స్మార్ట్కీతో హోండా డియో 125.. ధర ఎంతో తెలుసా?
Also Read
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
గత అక్టోబర్లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. ఇపుడు మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్హెచ్కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ (జేఏఎక్స్ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. జపాన్ ఏరోస్పేస్ సంస్థ చేసిన ప్రయోగాల్లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి గత అక్టోబర్లో వైఫల్యం ఎదురైంది. వాస్తవానికి ఎప్సిలాన్ రాకెట్ ఆధారంగా 2013 నుంచి ఐదు ప్రయోగాలను నిర్వహించింది. వచ్చే ఏడాది ఎస్పిలాన్-ఎస్ రకం రాకెట్ను ప్రయోగించాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. తాజా ప్రయోగం విఫలం కావడంతో.. శాస్త్రవేత్తలే అది పేలిపోయేట్లు చేయాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అతి భారీ అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహించే దేశాల్లో జపాన్ ఒకటి. ఈ దేశానికి చెందిన ఆస్ట్రోనాట్ కొయిచీ వకాట గతేడాది అక్టోబర్లో క్రూ-5 మిషిన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!