Train Drove With Noodles Soup: జపాన్లో కొత్త ప్రయోగం.. నూడుల్స్ సూప్తో రైలు ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Train Runs on Fuel Generated From Ramen Soup: ఈ ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి.. మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఊహకందని ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా జపాన్ వాళ్లు ఓ కొత్త ప్రయోగంతో ఆశ్చర్యచకితుల్ని చేశారు. నూడుల్స్ సూప్తో తయారు చేసిన పదార్థంతో.. రైలుని విజయవంతంగా నడిపారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. జపాన్లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ.. ఈ విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జపాన్ వారు ఎక్కువగా తినే రెండు రకాల వంటకాల వ్యర్థాలతో ఈ ప్రమోగం చేసింది.
జపాన్ వాసులు టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్ ఫ్రై) వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం రెస్టారెంట్లలోనే కాదు.. ఇళ్లల్లోనూ వీటిని పెద్దఎత్తున తయారు చేసుకుంటారు. అయితే.. అంతే స్థాయిలో ఈ వంటకాలు వృధా అవుతుంటాయి కూడా! దీన్ని అరికట్టడం కోసమే.. ఏదైనా ఒక పరిష్కారాన్ని వెతకాల్సిందేనని ఆలోచించారు. ఎట్టకేలకు వాళ్లకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. వృధా అవుతున్న ఆ ఆహార పదార్థాల నుంచి బయో డీల్ తయారు చేయాలని నిర్ణయించారు. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యర్థాల నుంచి బయో డీజిల్ నుంచి తయారు చేసే బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించారు.
Also Read
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ఆ నిషిడా షౌన్ సంస్థ కొన్ని రెస్టారెంట్ల నుంచి రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని రసాయనాలతో శుద్ధి చేసి, బయో డీజిల్ను తయారు చేసింది. మొదట ఈ బయో డీజిల్తో కొన్ని రైలింజన్లను నడపగా.. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో.. ఇటీవల మియాజాకీ నగరంలో ఓ సైట్-సీయింగ్ రైలుని ఆ వృథా బయో డీజిల్తో నడిపింది. ఈ రైలు నడుపుతున్నప్పుడు.. దాన్నుంచి వెలువడే పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోని సదరు సంస్థ తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్గా మారింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!