Train Drove With Noodles Soup: జపాన్లో కొత్త ప్రయోగం.. నూడుల్స్ సూప్తో రైలు ప్రయాణం
Japanese Train Runs on Fuel Generated From Ramen Soup: ఈ ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి.. మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఊహకందని ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా జపాన్ వాళ్లు ఓ కొత్త ప్రయోగంతో ఆశ్చర్యచకితుల్ని చేశారు. నూడుల్స్ సూప్తో తయారు చేసిన పదార్థంతో.. రైలుని విజయవంతంగా నడిపారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. జపాన్లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ.. ఈ విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జపాన్ వారు ఎక్కువగా తినే రెండు రకాల వంటకాల వ్యర్థాలతో ఈ ప్రమోగం చేసింది.
జపాన్ వాసులు టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్ ఫ్రై) వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం రెస్టారెంట్లలోనే కాదు.. ఇళ్లల్లోనూ వీటిని పెద్దఎత్తున తయారు చేసుకుంటారు. అయితే.. అంతే స్థాయిలో ఈ వంటకాలు వృధా అవుతుంటాయి కూడా! దీన్ని అరికట్టడం కోసమే.. ఏదైనా ఒక పరిష్కారాన్ని వెతకాల్సిందేనని ఆలోచించారు. ఎట్టకేలకు వాళ్లకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. వృధా అవుతున్న ఆ ఆహార పదార్థాల నుంచి బయో డీల్ తయారు చేయాలని నిర్ణయించారు. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యర్థాల నుంచి బయో డీజిల్ నుంచి తయారు చేసే బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించారు.
Also Read
- Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఆ నిషిడా షౌన్ సంస్థ కొన్ని రెస్టారెంట్ల నుంచి రామెన్ సూప్, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని రసాయనాలతో శుద్ధి చేసి, బయో డీజిల్ను తయారు చేసింది. మొదట ఈ బయో డీజిల్తో కొన్ని రైలింజన్లను నడపగా.. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో.. ఇటీవల మియాజాకీ నగరంలో ఓ సైట్-సీయింగ్ రైలుని ఆ వృథా బయో డీజిల్తో నడిపింది. ఈ రైలు నడుపుతున్నప్పుడు.. దాన్నుంచి వెలువడే పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోని సదరు సంస్థ తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్గా మారింది.
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!