Jaishankar-Pakistan PM: జైశంకర్కు పాక్ ప్రధాని షరీఫ్ షేక్హ్యాండ్.. పలకరింపులు
- పాకిస్థాన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన
- బుధవారం ఇస్లామాబాద్లో ఎస్సీవో సదస్సు
- జైశంకర్తో కరచాలనం చేసిన పాక్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇస్లామాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో సభ్యదేశాల అతిథుల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్, జైశంకర్లు ఒకరినొకరు షేక్హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం రావాలి..
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
ఎస్సీవో సదస్సు బుధవారం జరగనుంది. భారత బృందానికి విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారు. మొత్తంగా ఆయన పాకిస్థాన్లో 24గంటల కంటే తక్కువ సమయమే ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సదస్సులో చైనా, రష్యా ప్రధానులు కూడా పాల్గొననున్నారు. కీలక సమావేశం నేపథ్యంలో ఇస్లామాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఎస్సీవో సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా భారత్కు ఆహ్వానం అందింది. పాక్లో పర్యటిస్తున్నప్పటికీ ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అటు పాకిస్థాన్ కూడా ద్వైపాక్షిక చర్చలపై ఇలాగే స్పందించింది. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్లో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అఫ్గాన్పై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పాక్కు వెళ్లారు.
#WATCH | Islamabad: Pakistan PM Shehbaz Sharif welcomes EAM Dr S Jaishankar and other SCO Council Heads of Government, to a dinner hosted by him.
EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government.
(Video Source: PTV) pic.twitter.com/BHtUhuLm9e
— ANI (@ANI) October 15, 2024
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!