Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- పాక్ బహవల్పూర్లో జైషే మహ్మద్ స్థావరం పునర్నిర్మాణం..
- ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న మర్కజ్ సుభానల్లా ఉగ్ర స్థావరం..
- స్వయంగా పాక్ ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఇందులో ముఖ్యంగా పీఓకేలోని మురిద్కే ఉన్న లష్కరే తోయిబా కార్యాలయం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలను భారత్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM) మార్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయడం ఆపరేషన్ సిందూర్లోనే హైలెట్గా నిలిచింది. భారత్ 2025 మే 7న చేసిన దాడిలో జైష్ చీఫ్ మసూద్ అజార్ బంధువులు కూడా మరణించారు.
ఇదిలా ఉంటే దాడులు జరిగిన 15 నెలల తర్వాత జైష్ మళ్లీ తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంది. గతేడాది మేలో భారత దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ కాంపౌండ్కు కొత్త మార్బుల్, పెయింట్, ప్లాస్టర్ వేశారు. దెబ్బతిన్న గోపురాలను కూడా తిరిగి నిర్మించారు. ప్రధాన హాల్లోని దాడుల ఆనవాళ్లను తొలగించి భవనాన్ని పునరుద్ధరించారు.
Also Read
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
జైషే కార్యాలయం నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా 25 కోట్ల పాక్ రూపాయాలను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 11 కోట్ల రూపాయల్ని ప్రధాన హాల్ పునర్నిర్మాణానికి ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదే కాకుండా ప్రధాన కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న మద్రసా అల్ సబీర్, జైషే కమాండర్ల నివాస ప్రాంతాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కొత్త నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
మార్కజ్ సుభాన్ అల్లా అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 18 ఎకరాల్లో విస్తరించిన ఈ కాంప్లెక్స్ను ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మసీదుతో పాటు జైష్ కార్యకలాపాలకు సంబంధించిన పలు సౌకర్యాలు ఉన్నాయి. నిజానికి పాక్ ప్రభుత్వం 2002లో జైషే మహ్మద్ను నిషేధించినప్పటికీ, ఆ సంస్థ దేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడులను జైషే మహ్మద్ నిర్వహించింది.
తాజావార్తలు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!