Israel-Hamas: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. తాజా దాడుల్లో ఆరుగురు మృతి
- గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
- తాజా దాడుల్లో ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. కానీ ఇజ్రాయెల్ అతిక్రమించింది. హమాస్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఆరుగురు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ప్రధానిగా తొలిసారి మహిళ ఎన్నిక
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. గాజా నగరంలోని ఒక ఇంటిలో జరిగిన దాడిలో నలుగురు.. దక్షిణాన ఖాన్ యూనిస్లో జరిగిన మరొక దాడిలో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. ట్రంప్ షరతులకు హమాస్ అంగీకరించిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఓ శాంతి చర్చలకు హమాస్ అంగీకరించిన తరుణంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రకటనకు భిన్నంగా మిత్రదేశం ఇజ్రాయెల్ వ్యవహారిస్తోంది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్కు ఇజ్రాయెల్ సూచన
శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో శుక్రవారం ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. అంతేకాకుండా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హమాస్ బందీల విడుదలకు అంగీకారం తెల్పడంతో పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది.
తాజావార్తలు
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!