Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది.. కొనసాగుతున్న బాంబుల వర్షం
- హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది..
- ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయెలీలు.. 41 వేల మంది పాలస్తీనీయన్లు మృతి..
- హమాస్- లెబనాన్- ఇరాన్ దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది. 1200 మంది ఇజ్రాయెలీలు ఈ దాడుల్లో మరణించారు. అందులో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా గడ్డపై నెత్తుటి వరదను పారిస్తుంది. ఈ ఏడాది కాలంలో 41వేల మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. అందులో దాదాపు సగం మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇక, అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్ను నాశనం చేస్తానని ఏడాది క్రితం ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 13, 2023న ఇజ్రాయెల్ గాజాపై ఫస్ట్ వైమానిక దాడులను ప్రారంభించింది. గాజా భూభాగాన్ని ముట్టడి చేయగా.. 2023 నవంబర్ 15న ఇజ్రాయెల్ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫాపై దాడికి పాల్పడ్డాయి. ఫిబ్రవరి 29, 2024న, ఇజ్రాయెల్ బలగాలు ఆహారం అందించేందుకు వస్తున్న కాన్వాయ్ వైపు వెళ్తున్న 120 మంది పాలస్తీనియన్లను కాల్చి చంపేశారు. అలాగే, మే 7, 2024న రఫాపై ఇజ్రాయెల్ భూదాడి చేసింది.
Read Also: Paruchuri Venkateswara Rao : ప్రేక్షకులు మెచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
అలాగే, జూలై 2024 నాటికి, ఇజ్రాయెల్ సైన్యం హమాస్పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించింది. ఈ దాడుల్లో హమాస్ సాయుధ విభాగం చీఫ్ మహమ్మద్ దీఫ్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్లను హతమార్చింది. ఇక, సెప్టెంబరు 2024లో, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా పాలస్తీనాకు మద్దతుగా ఉంది. సెప్టెంబరు 17, 18న లెబనాన్ అంతటా వేలాది హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఈ దాడుల్లో 39 మంది చనిపోయారు. దాదాపు 3,000 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Mayank Yadav: అరంగేట్ర మ్యాచ్లోనే అరుదైన ఘనత సాధించిన మయాంక్ యాదవ్!
అయితే, సెప్టెంబర్ చివరి వారంలో హిజ్బుల్లా చీఫ్ కమాండర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా మరణించాడు. దీంతో ఇరాన్ నేరుగా బరిలోకి దిగింది. నస్రల్లా మరణం వ్యర్థం కాదంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇలా అక్టోబర్ 7, 2023 తర్వాత ఈ ఏడాది కాలంలో పశ్చిమాసియాలో ఉద్రక్తతలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..