Gaza-Israel: గాజాలో మళ్లీ దాడులు.. 30 మంది మృతి
- గాజాలో మళ్లీ దాడులు
- 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి. మరోసారి హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ దళాలపై దాడులకు తెగబడిందన్న ఆరోపణలతో ప్రధాని నెతన్యాహు శక్తివంతమైన దాడులకు ఆదేశించారు. దీంతో గాజాపై ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేయడంతో 30 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో జాగ్రత్త..!
Also Read
- US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్తో మళ్లీ టెన్షన్..
- Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడి తర్వాత పొగలు ఎగిసిపడ్డాయి. గాజాలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఫోర్స్గా పనిచేస్తున్న ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సంధిని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని గాజా పౌర రక్షణ సంస్థ ఆరోపించింది. అయితే ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో ఘర్షణలు ఉన్నప్పటికీ కాల్పుల విరమణ మాత్రం కొనసాగుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్
ప్రస్తుతం శాంతి ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న బందీల మృతదేహాలను అప్పగిస్తోంది. మంగళవారం మరో బందీని అప్పగిస్తామని హమాస్ తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి సమయం పడుతుందని హమాస్ తెలిపింది. కానీ ఇంతలోనే హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఇజ్రాయెల్కు దాడులకు దిగింది. తాజా ఘర్షణలతో మళ్లీ ఉద్రిక్తతలు మొదటికొచ్చాయి.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడులకు తెగబడి 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈనెలలో ట్రంప్ మధ్యవర్తిత్వంలో గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కానీ కొద్ది రోజులకే శాంతి ఒప్పందం గాడి తప్పింది.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!