Benjamin Netanyahu: ఇరాన్ దాడి సమయంలో బంకర్లోకి నెతన్యాహు పరుగులు.. నిజమెంత?
- ఇరాన్ దాడి సమయంలో నెతన్యాహు పరుగులు
- బంకర్లోకి వెళ్తున్నారంటూ ఇరాన్ సోషల్ మీడియాలో వైరల్
- మూడేళ్ల క్రితం నాటిదిగా తేల్చిన ఫేస్బుక్
- పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు పరుగులు
- తాజాగా ఇరాన్ మీడియాలో వైరల్
ఇజ్రాయెల్పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
‘‘ఎవరైనా దయచేసి బెంజమిన్ నెతన్యాహుకు దాక్కోవడానికి స్థలం ఇవ్వండి. అన్నింటికంటే అతను బంకర్లో దాక్కుని తన ప్రాణాలను కాపాడుకుంటున్నాడు. అతను పారిపోయి దాక్కుంటున్నాడు. తన దేశస్థులను తమను తాము రక్షించుకోవడానికి వదిలివేసాడు.’’ అంటూ ఇరానీయులు ట్వీట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
అయితే ఈ వీడియోపై కొన్ని సంస్థలు ఫ్యాక్ట్ చెకింగ్ చేయగా.. మూడేళ్ల క్రితం నాటి వీడియోగా తేలింది. 2021లో ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనంలోని కారిడార్లలో ఆయన హడావుడిగా పరుగెడుతున్న దృశ్యాలు అవి. సమావేశంలో హాజరయ్యేందుకు ఆయన ఆ విధంగా వెళ్లినట్లుగా తేలింది. ఇందుకు సంబంధించి మూడేళ్ల క్రితం నాటి ఫేస్బుక్లో ఈ వీడియోలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Sabitha Indra Reddy : కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేయడం ఇది రెండో సారి. ఏప్రిల్లో ఇదే తరహామైన దాడి చేయడంతో మిత్ర రాజ్యాల సహకారంతో తిప్పికొట్టింది. మంగళవారం కూడా అదే తరహాలో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని క్షిపణులు మాత్రం టెల్అవీవ్పై పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా సమాచారం. ఇటీవల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. అయితే ఇరాన్కు ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీనే అని తెలుస్తోంది. అంతేకాకుండా అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. భారత్లోని ఇజ్రాయెల్ దౌత్య ప్రతినిధి గయ్ నిర్ మాట్లాడుతూ… తాము టెహ్రాన్కు తగిన జవాబు ఇస్తామని తెలిపారు. ఇక వేళ ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధం కోరుకుంటే భారీ తప్పుగా మిగులుతుందని చెప్పుకొచ్చారు.
אני תמיד גאה לרוץ בשבילכם. 🇮🇱💪🏻
צולם לפני חצי שעה בכנסת pic.twitter.com/Tk386NOKU5
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) December 13, 2021
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!