Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టోగో (Togo) దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిరాన్’ (MT Siron) అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్లోని షినాస్ పోర్ట్ పరిమితికి సమీపంలో ఇతర నౌకలతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో ఇరాన్ కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని భారతీయ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
భారత ప్రభుత్వం స్పందన..
ఈ ఘటనపై కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధవా సోమవారం విలేకరులతో మాట్లాడారు. “ఏప్రిల్ 25న ఎంటీ సిరాన్ నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని” ఆయన తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భారత రాయబార కార్యాలయాలు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర ప్రయాణాల్లో భారతీయ నావికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రంధవా స్పష్టం చేశారు. నిజానికి ఇరాన్ దళాలు భారతీయ నౌకలపై ఇలా దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు భారతీయ నౌకలపై దాడులు చేశాయి. వీఎల్సీసీ సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ నౌకలు ‘హార్ముజ్ జలసంధి’ దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ వరుస ఘటనలపై భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమన్ తీరంలో జరిగిన తాజా ఘటనతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Also Read
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!