US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఒక బిల్ బోర్డుపై ప్రకటన ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇందులో ట్రంప్ను చంపేస్తామని చెబుతూ, ఆయన ఒక శవపేటికలో ఉన్నట్లు ఫోటోను ప్రదర్శించారు. ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ‘‘ట్రంప్ను చంపేస్తాం’’ అని దానిపై రాశారు.
ట్రంప్ జుట్టు చిందరవందగా ఉండగా, కళ్లు, నోరు మూసుకుని శవపేటికలో పడి ఉన్నట్లుగా ఇరాన్ చూపించింది. ఈ బిల్బోర్డుకు సమీపొంలో ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సంబంధించిన బొమ్మను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇరాన్లో ఇలా రాజకీయ సందేశాలు ప్రజలకు చేరవేసేందుకు బిల్బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ దేశ రాజధాని టెహ్రాన్తో పాటు ప్రతీ నగరంలో అమెరికా, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నినాదాలు, ఫోటోలను ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి ప్రచార బోర్డులు ఇదే తొలిసారి కాదు. ఇటీవల ట్రంప్ లక్ష్యంగా ఇరాన్ వ్యాప్తంగా పలు పోస్టర్లు వెలిశాయి. మే నెలలో ఏర్పాటు చేసిన ఒక పోస్టర్లో ఆయన నోటికి కుట్లు వేసినట్లు చూపించారు. మరో హోర్డింగ్లో పర్షియన్ గల్ఫ్లో భారీ వలలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకలు చిక్కుకున్నట్లుగా చూపించే పోస్టర్ ప్రదర్శించారు. ఇటీవల ఖమేనీ అంత్యక్రియల వేళ, ట్రంప్, నెతన్యాహూలను చంపేస్తామంటూ నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇదే కాకుండా ఇటీవల ఇరాన్ హిట్ లిస్ట్లో ట్రంప్, నెతన్యాహూ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సహా 12 మంది విదేశీ నేతల ఉన్నట్లుగా కన్జర్వేటివ్ పత్రిక నివేదించింది.

