Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు
- ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఎక్స్లో నిలదీసిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ పలు ప్రశ్నలు సంధించారు. ఒక అమాయక ఇరాన్ అధికారి భార్యను చంపడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పెజెష్కియన్ నిలదీశారు. ఈ ఘటనపై ప్రపంచమే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఇలా చేస్తే దౌత్యం ఎలా జరుగుతుంది? అని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నేను అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే మా వ్యూహాత్మక విదేశీ విధాన మండలి ప్రధానుడి కుటుంబం హత్యాయత్నానికి గురైంది. ఈ దాడిలో ఆయన అమాయక భార్య మృతిచెందింది. దీనిపై ప్రపంచమే తీర్పు చేయాలి. సంభాషణ, చర్చలకు పాల్పడేది ఏ వైపు.. ఉగ్రవాదానికి దిగేది ఏ వైపు?.’’ ప్రపంచమే గమనించాలని పెజెష్కియన్ కోరారు.
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
ఈ ఘటనను అంతర్జాతీయ సంబంధాలతో పెజెష్కియన్ ముడి పెట్టారు. ఎవరు శాంతిపరులో.. ఎవరు వైరుద్యాన్ని సృష్టిస్తున్నారో గమనించాలని కోరారు. అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దాడి జరగడం ఏ మాత్రం భావ్యం అని అడిగారు. ఇది నిర్మాణాత్మక సంప్రదింపులకు సాధ్యమవుతుందా? అని వ్యాఖ్యానించారు. కాబట్టి రెండు దేశాల వైఖరిని ప్రపంచ దేశాలు అంచనా వేయాలని కోరారు. ఈ ఘటనపై మాత్రం ప్రపంచ దేశాలే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Just as I was addressing the American people, the head of our Strategic Council on Foreign Policy was targeted in an assassination attempt, leading to the martyrdom of his innocent wife. Let the world judge; which side engages in dialogue and negotiation, and which in terrorism?
— Masoud Pezeshkian (@drpezeshkian) April 3, 2026
తాజావార్తలు
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!