Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు
- ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
- ఎక్స్లో నిలదీసిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ పలు ప్రశ్నలు సంధించారు. ఒక అమాయక ఇరాన్ అధికారి భార్యను చంపడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పెజెష్కియన్ నిలదీశారు. ఈ ఘటనపై ప్రపంచమే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఇలా చేస్తే దౌత్యం ఎలా జరుగుతుంది? అని అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నేను అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే మా వ్యూహాత్మక విదేశీ విధాన మండలి ప్రధానుడి కుటుంబం హత్యాయత్నానికి గురైంది. ఈ దాడిలో ఆయన అమాయక భార్య మృతిచెందింది. దీనిపై ప్రపంచమే తీర్పు చేయాలి. సంభాషణ, చర్చలకు పాల్పడేది ఏ వైపు.. ఉగ్రవాదానికి దిగేది ఏ వైపు?.’’ ప్రపంచమే గమనించాలని పెజెష్కియన్ కోరారు.
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
ఈ ఘటనను అంతర్జాతీయ సంబంధాలతో పెజెష్కియన్ ముడి పెట్టారు. ఎవరు శాంతిపరులో.. ఎవరు వైరుద్యాన్ని సృష్టిస్తున్నారో గమనించాలని కోరారు. అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దాడి జరగడం ఏ మాత్రం భావ్యం అని అడిగారు. ఇది నిర్మాణాత్మక సంప్రదింపులకు సాధ్యమవుతుందా? అని వ్యాఖ్యానించారు. కాబట్టి రెండు దేశాల వైఖరిని ప్రపంచ దేశాలు అంచనా వేయాలని కోరారు. ఈ ఘటనపై మాత్రం ప్రపంచ దేశాలే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Just as I was addressing the American people, the head of our Strategic Council on Foreign Policy was targeted in an assassination attempt, leading to the martyrdom of his innocent wife. Let the world judge; which side engages in dialogue and negotiation, and which in terrorism?
— Masoud Pezeshkian (@drpezeshkian) April 3, 2026
తాజావార్తలు
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!