Site icon NTV Telugu

US-Iran Conflict: దుబాయ్ హోటళ్లపై దాడులు చేస్తాం.. యూఎస్‌కు ఇరాన్ అల్టిమేటం..

Iranisraelwar

Iranisraelwar

US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది.

Read Also: RCB vs SRH Playing XI: హై వోల్టేజ్ ఫైట్.. ఆర్సీబీ vs సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదే!

గురువారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, గల్ఫ్ దేశాల ప్రజలను అమెరికా సైనికులు “మానవ కవచాలుగా” వాడుకుంటున్నారని ఆరోపించారు. యూఎస్ సైనికులకు బుకింగ్స్ ఇవ్వొద్దని యూఏఈ, బహ్రైయిన్ హోటళ్లకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. మేం చేతులు కట్టుకుని కూర్చోలేమని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫజల్ షెకార్చి గురువారం అన్నారు. మేం ఊరికే కూర్చుని, అమెరికన్లు మాపై దాడి చేయడానికి అనుమతించాలా? అని ప్రవ్నించారు. అమెరికా దళాలు ఉన్న హోటళ్లను, కార్యాలయాలను టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు.

సిరియా, లెబనాన్, జిబౌటీ దేశాలకు కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూభాగాలను అమెరికా ఉపయోగిస్తున్నట్లు ఇరాన్ చెప్పింది. తమ భూభాగాలపై ఈ దేశాల నుంచి అమెరికా దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ 83వ దశ దాడుల్ని ప్రారంభిస్తామని ఇరాన్ హెచ్చరించింది.

Exit mobile version