Hormuz Amid Crisis: హోర్ముజ్ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్కు ఇరాన్ ఎంత వసూలు చేస్తుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Amid Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్ జలసంధిపై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ఇరాన్ భారీ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18 కోట్లకు పైగా) చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది.
సంక్షోభానికి కారణాలు:
ఇరాజ్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి దారితీశాయి. యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటం వల్ల, ఈ మార్గంలో ఏర్పడిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Also Read
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
భారీ రుసుముల వసూలు:
లండన్కు చెందిన “ఇరాన్ ఇంటర్నేషనల్” నివేదిక ప్రకారం, ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్దీ ఈ రుసుముల వసూలును సమర్థించారు. “యుద్ధానికి మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే ఈ రుసుములు అవసరం” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతర్జాతీయ ప్రభావం:
చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.. పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. షిప్పింగ్ కంపెనీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది.. పాకిస్థాన్, శ్రీలంక, యూకే వంటి దేశాలు ఇప్పటికే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. అయితే ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరవాలని కోరుతూ, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ నాయకత్వం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులు జరిగితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!