Hormuz Amid Crisis: హోర్ముజ్ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్కు ఇరాన్ ఎంత వసూలు చేస్తుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Amid Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్ జలసంధిపై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ఇరాన్ భారీ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18 కోట్లకు పైగా) చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది.
సంక్షోభానికి కారణాలు:
ఇరాజ్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి దారితీశాయి. యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటం వల్ల, ఈ మార్గంలో ఏర్పడిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Also Read
- Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
భారీ రుసుముల వసూలు:
లండన్కు చెందిన “ఇరాన్ ఇంటర్నేషనల్” నివేదిక ప్రకారం, ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్దీ ఈ రుసుముల వసూలును సమర్థించారు. “యుద్ధానికి మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే ఈ రుసుములు అవసరం” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతర్జాతీయ ప్రభావం:
చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.. పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. షిప్పింగ్ కంపెనీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది.. పాకిస్థాన్, శ్రీలంక, యూకే వంటి దేశాలు ఇప్పటికే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. అయితే ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరవాలని కోరుతూ, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ నాయకత్వం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులు జరిగితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
SSY: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం వారికి వరం.. రూ.50 లక్షలు పొందొచ్చు!
-
Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..