Site icon NTV Telugu

US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..

Us Iran Talks (2)

Us Iran Talks (2)

US-Iran Talks: మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి తెర పడేందుకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగబోతున్నాయి. శనివారం ఇరాన్, అమెరికా బృందాలు ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యూఎస్ తరుపున నేతృత్వం వహిస్తుండగా, ఇరాన్ తరుపున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలి‌బాఫ్, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వం వహిస్తున్నారు.

Read Also: Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

ఇదిలా ఉంటే, చర్చలు మొదలువుతున్న సమయంలో ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చి జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చర్చలపై పలు విషయాలను జర్మనీతో పంచుకున్నారు. మొదటగా ఇరాన్ చర్చల్లోకి ‘‘అపనమ్మకం’’తోనే ప్రవేశిస్తున్నామని చెప్పింది. ఇరాన్‌కు అమెరికాపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. గతంలొో పలుమార్లు మాట తప్పిన చరిత్ర అమెరికాకు ఉందని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ ఒక బాధ్యతయుతమైన దేశంగా ముందుగా కాల్పుల విరమణకు అంగీకరించిందని, ఇరాన్ విధించిన షరతులలో పూర్తిస్థాయి ఘర్షణ నిలిపేయడం, తమకు జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించడం , ఈ దాడులకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయడం వంటివి ఉన్నాయి. తమ షరతులు నెరవేర్చకపోతే చర్చలు విఫలమవుతాయని ఇరాన్ హెచ్చరించింది.

Exit mobile version