NTV Telugu Site icon

Delhi: ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందుకు.. అగ్రరాజ్యాలు వెనక్కు

Untitled 3

Untitled 3

Delhi: రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిలకడ లేని రాజకీయ, ఆర్థిక విషయాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపనున్నాయి.

read Also:Mumbai: డబుల్ డెక్కర్ బస్సులకి కాలం చెల్లింది.. వాటిస్థానంలో ఎం రానుంది?

రాజకీయ, ఆర్థికపరమైన ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేక పోవచ్చని 10 మందిలో 6 మంది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.

read Also:Vande Bharat Sleeper Train: ప్రారంభానికి సిద్ధంగా వందే భారత్ స్లీపర్ రైలు.. మొత్తం ఎన్ని కోచ్‎లు ఉంటాయంటే?

అలానే ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలలో చోటు చేసుకున్న ఉద్రిక్తలు కూడా అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని 75 % మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ పరంగా చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాలపైనే అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉండొచ్చని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

read Also:CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్‌.. బాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు

చాలా దేశాల్లో ఆహార భద్రత, వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి విషయాల్లోనూ పురోగాభివృధి తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ఆగ్నేయాసియా దేశాలు ఆర్థికపరంగా ముందుండే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్‌ అధిక ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉందని 90 శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

read Also:Maharashtra: రెండు జిల్లాల పేర్లు మారుస్తూ నోటిఫికేషన్.. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ కొత్త పేర్లు ఏంటంటే..?

అమెరికా లోను 2023 మరియు 2024 లో అధిక వృద్ధి ఉండొచ్చని 10 లో 8 మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా ఈ సంవత్సరం ఐరోపా దేశం వృద్ధి పరంగా వెనకబడొచ్చని 77 శాతం మంది అంచనా వేశారు.