Site icon NTV Telugu

Lawsuit on PM Modi: మోడీ, జగన్‌, అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ.. ఎందుకో తెలుసా?

Pm Narendra Modi

Pm Narendra Modi

Lawsuit on PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. అవినీతి, పెగాసస్ స్పైవేర్‌, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో ఓ భారతీయ అమెరికన్‌ వైద్యుడు దావా వేశారు. రాజకీయ ప్రత్యర్థులపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాజ్యంలో ఆరోపించారు. భారతీయ-అమెరికన్‌ డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ అమెరికాలో కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఈ ఏడాది మే 24న 53 పేజీల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా.లోకేశ్.. అమెరికాలోని రిచ్‌మండ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.

NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్‌-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..

ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్​ స్క్వాబ్​ పేరును కూడా లోకేశ్ దావాలో​ ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై విచారణ కోసం కొలంబియా డిస్ట్రిక్ట్​ కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. మోడీ, జగన్​, అదానీకి ఆగస్టు 4న, స్విట్జర్లాండ్‌లో ఉన్న క్లాస్​ స్క్వాబ్‌కు ఆగస్టు 2న సమన్లు వెళ్లాయి.అయితే న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ అటార్నీ జనరల్​ రవి బాత్రా దీనిని “డెడ్ ఆన్ అరైవల్ దావా”గా పేర్కొన్నారు. ఈ దావాపై సంతకం చేయడానికి న్యాయవాదులెవరూ అంగీకరించలేదని ఆయన చెప్పారు. డాక్టర్​ లోకేశ్ ఖాళీగా ఉన్నారని, అందుకే 53 పేజీల దావా వేశారని బాత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Exit mobile version