Virat Kohli-Vaughan: విరాట్ కోహ్లీని అమ్మేస్తా.. మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- పాడ్కాస్ట్లో వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- విరాట్ కోహ్లీని అమ్మేస్తా
- రోహిత్ని ధోనీకి సబ్స్టిట్యూట్గా పెట్టుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Vaughan About Virat Kohli: టీమిండియా గొప్ప ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ముందువరసలో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు సారథులు దేశంకు ఎన్నో ట్రోఫీలు, టైటిల్స్ అందించారు. భారత్ జట్టు తరఫున ఓకే జట్టులో ఆడిన వీరు.. ఐపీఎల్లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే వీరు ఐపీఎల్లో ఒకే జట్టులో ఉంటే?, ముగ్గురిలో ఒక్కరినే ఆడాలించాలి అనే ప్రశ్న ఎవరికీ తట్టదు కూడా. కానీ ఇదే ప్రశ్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్కి ఓ పాడ్కాస్ట్లో ఎదురైంది.
‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల్లో ఒక్కరినే ఆడించాల్సిన పరిస్థితే వస్తే.. నేను మహీని ఎంచుకుంటా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెప్టెన్గా ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ అందించాడు. వేరే ఎవ్వరూ జట్టుని అంత గొప్పగా నడిపించలేరు. రోహిత్, కోహ్లీల్లో ఒకరిని వదులుకోవాల్సి వస్తే.. కోహ్లీని మరో ఫ్రాంచైజీకి అమ్మేస్తా. ఎందుకంటే విరాట్ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. రోహిత్ ఆరు సార్లు ముంబైకి కప్ను అందించాడు. రోహిత్ని ధోనీకి సబ్స్టిట్యూట్గా పెట్టుకుంటా’ అని మైఖేల్ వాన్ తెలిపాడు.
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
Also Read: Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు మృతి!
‘ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ 2008 నుంచి ఇప్పటివరకూ ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ లేకున్నా.. విరాట్ ఖాతాలో చాలా రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు 251 మ్యాచ్లు ఆడి 8 వేలకు పైగా రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. అతడిని వేరే ఫ్రాంచైజీకి అమ్మితే కోట్లు వస్తాయి. నాకు మంచి వ్యాపారం కూడా అవుతుంది’ అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం జరగనుంది. రోహిత్ వేలంకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విరాట్ బెంగళూరుకే ఆడనున్నాడు. ఇక ధోనీ ఆడుతాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..