Virat Kohli-Vaughan: విరాట్ కోహ్లీని అమ్మేస్తా.. మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- పాడ్కాస్ట్లో వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- విరాట్ కోహ్లీని అమ్మేస్తా
- రోహిత్ని ధోనీకి సబ్స్టిట్యూట్గా పెట్టుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Vaughan About Virat Kohli: టీమిండియా గొప్ప ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ముందువరసలో స్థానం ఉంటుంది. ఈ ముగ్గురు సారథులు దేశంకు ఎన్నో ట్రోఫీలు, టైటిల్స్ అందించారు. భారత్ జట్టు తరఫున ఓకే జట్టులో ఆడిన వీరు.. ఐపీఎల్లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. అయితే వీరు ఐపీఎల్లో ఒకే జట్టులో ఉంటే?, ముగ్గురిలో ఒక్కరినే ఆడాలించాలి అనే ప్రశ్న ఎవరికీ తట్టదు కూడా. కానీ ఇదే ప్రశ్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్కి ఓ పాడ్కాస్ట్లో ఎదురైంది.
‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల్లో ఒక్కరినే ఆడించాల్సిన పరిస్థితే వస్తే.. నేను మహీని ఎంచుకుంటా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెప్టెన్గా ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ అందించాడు. వేరే ఎవ్వరూ జట్టుని అంత గొప్పగా నడిపించలేరు. రోహిత్, కోహ్లీల్లో ఒకరిని వదులుకోవాల్సి వస్తే.. కోహ్లీని మరో ఫ్రాంచైజీకి అమ్మేస్తా. ఎందుకంటే విరాట్ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. రోహిత్ ఆరు సార్లు ముంబైకి కప్ను అందించాడు. రోహిత్ని ధోనీకి సబ్స్టిట్యూట్గా పెట్టుకుంటా’ అని మైఖేల్ వాన్ తెలిపాడు.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Also Read: Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు మృతి!
‘ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినప్పటికీ 2008 నుంచి ఇప్పటివరకూ ఒకే ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ లేకున్నా.. విరాట్ ఖాతాలో చాలా రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు 251 మ్యాచ్లు ఆడి 8 వేలకు పైగా రన్స్ చేశాడు. స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. అతడిని వేరే ఫ్రాంచైజీకి అమ్మితే కోట్లు వస్తాయి. నాకు మంచి వ్యాపారం కూడా అవుతుంది’ అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం జరగనుంది. రోహిత్ వేలంకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విరాట్ బెంగళూరుకే ఆడనున్నాడు. ఇక ధోనీ ఆడుతాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!