Hamas: ట్రంప్ వార్నింగ్ను ఖాతర్ చేయని హమాస్.. బందీలను విడుదల చేసేదీలేదని ప్రకటన
- ట్రంప్ వార్నింగ్ను ఖాతర్ చేయని హమాస్
- బందీలను విడుదల చేసేదీలేదని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లను జోర్డాన్, ఈజిప్ట్లకు తరలిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ శనివారంలోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేకుంటే హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అరబ్ దేశాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Raghu Babu: చిరంజీవి ప్రశంసించడం వల్ల.. 400 సినిమాల్లో అవకాశాలు
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందించారు. శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేశాడు. ఈ మేరకు జెరూసలేం పోస్ట్లో పేర్కొన్నారు. అల్-జజీరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. ఒకేసారి బందీలను విడుదల చేసేదీలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అందుకోసమే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని హమాస్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య.. భార్య ఏం చేసిందంటే..!
జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. హమాస్ దగ్గర 76 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు హమాస్ 16 మంది ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడుదల చేసింది. ఇక ఒప్పందంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 15) మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. కానీ ట్రంప్ మాత్రం మొత్తం బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. ‘‘నాకు సంబంధించినంతవరకు శనివారం 12 గంటలలోపు బందీలందరినీ తిరిగి అప్పగించాలి. ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. లేదంటే కాల్పు విరమణ ఒప్పందం రద్దు చేయమని నేను చెబుతాను. అన్ని మార్గాలు మూసిపోతాయి. అనంతరం నరకం చూస్తారు.’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!
తాజావార్తలు
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!