Hamas: ట్రంప్ వార్నింగ్ను ఖాతర్ చేయని హమాస్.. బందీలను విడుదల చేసేదీలేదని ప్రకటన
- ట్రంప్ వార్నింగ్ను ఖాతర్ చేయని హమాస్
- బందీలను విడుదల చేసేదీలేదని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లను జోర్డాన్, ఈజిప్ట్లకు తరలిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ శనివారంలోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేకుంటే హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అరబ్ దేశాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Raghu Babu: చిరంజీవి ప్రశంసించడం వల్ల.. 400 సినిమాల్లో అవకాశాలు
Also Read
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందించారు. శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేశాడు. ఈ మేరకు జెరూసలేం పోస్ట్లో పేర్కొన్నారు. అల్-జజీరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. ఒకేసారి బందీలను విడుదల చేసేదీలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అందుకోసమే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని హమాస్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య.. భార్య ఏం చేసిందంటే..!
జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. హమాస్ దగ్గర 76 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు హమాస్ 16 మంది ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడుదల చేసింది. ఇక ఒప్పందంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 15) మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. కానీ ట్రంప్ మాత్రం మొత్తం బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. ‘‘నాకు సంబంధించినంతవరకు శనివారం 12 గంటలలోపు బందీలందరినీ తిరిగి అప్పగించాలి. ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. లేదంటే కాల్పు విరమణ ఒప్పందం రద్దు చేయమని నేను చెబుతాను. అన్ని మార్గాలు మూసిపోతాయి. అనంతరం నరకం చూస్తారు.’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!