Israel-Hamas: గుడ్ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన
- గుడ్ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన
- యుద్ధం ఆపితే బందీలను విడుదల చేస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బందీల విడుదల విషయంలో హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై యుద్ధాన్ని ముగిస్తే మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. గాజా చీఫ్, చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఖలీల్ అల్-హయ్యా టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇరు పక్షాలు సమగ్ర ఒప్పందం చేసుకోవాలని హయ్యా సూచించారు. మధ్యంతర ఒప్పందాలను మాత్రం అంగీకరించబోమని.. సమగ్ర ఒప్పందం చేసుకుంటేనే అంగీకరిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా
Also Read
తొలి విడత ఒప్పందంలో భాగంగా ఖైదీ-బందీల విడుదల జరిగింది. ఆ ఒప్పందం ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘర్షణలను చల్లబరిచేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు కృషి చేశారు. కానీ ఇరు పక్షాలు ఒకరినొకరు నిందించుకోవడంతో పురోగతి కనిపించలేదు. మొత్తానికి గుడ్ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన చేసింది. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. దీనికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!
తొలి విడత ఒప్పందంలో భాగంగా హమాస్ 38 మంది బందీలను విడుదల చేసింది. మిగిలిన 59 మంది బందీలు విడుదల కోసం చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బందీలను విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ అంటోంది. అయితే యుద్ధాన్ని ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ పట్టుబడుతోంది. ఆయుధాలను విడిచి పెట్టాలన్న డిమాండ్ను హమాస్ తిరస్కరిస్తోంది. ఇక గురువారం గాజాపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 32 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలపై జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇది కూడా చదవండి: Reels On Busy Road: నడి రోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్.. తాట తీసిన పోలీసులు..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?